
Meerut murder case in uttar pradesh: మేరఠ్ హత్య కేసు ప్రస్తుతం దేశంలో సంచలనంగా మారింది. ఇష్టపడి ప్రేమ వివాహం చేసుకుని, మళ్లీ ప్రియుడి మోజులో పడి.. భర్తను అత్యంత కిరాతకంగా హతమార్చింది భార్య ముస్కాన్. ప్రస్తుతం ముస్కాన్ ను, ఆమె ప్రియుడు సాహిల్ ను పోలీసులు జైలుకు తరలిచారు. అయితే.. జైలులో వీళ్లు ఆహరం తీసుకొకుండా.. మత్తు మందులు ఇవ్వాలని, గంజాయి కావాలని డిమాండ్ చేస్తున్నారు. కొన్నిసార్లు తొటి ఖైదీలపై దాడులకు కూడా పాల్పడుతున్నారు.
వీరు అతిగా మత్తు పదార్థాలు సేవించడం వల్ల ఈ విధంగా మారిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో సాహిల్ కు పోలీసులు వైద్య సేవలు అందిస్తున్నారు. మరొవైపు.. నిందితులు కొన్నేళ్లుగా డ్రగ్స్ కు అలవాటు పడ్డారని.. భర్త సౌరభ్ రాజ్ పుత్ ను హత్య చేసే క్రమంలో కూడా ఇదే విధంగా మత్తులో ఉన్నారని.. అంతేకాకుండా.. భర్త గుండెల మీద మూడు సార్లు పొడిచి, తల, మొండెం వేరు చేశారంటే.. వీరు ఎంత శాడిస్టులో అర్థం చేసుకొవచ్చు.
ఆ తర్వాత భర్త మొండెంను బెడ్ కింద పెట్టి.. ప్రియుడితో రోమాన్స్ కూడా చేసింది. ఈ క్రమంలో భర్త బాడీని 15 ముక్కలుగా చేసి ఒక డ్రమ్ కొనుగోలు చేసి దానిలో చెత్తను నింపి.. సిమెంట్ వేసి మరీ క్లోజ్ చేశారు. మనాలీకి వెళ్లి.. అక్కడ హోలీ కూడా జరుపుకున్నారు. ఈ ఘటనలో నిందితులును బహిరంగంగా ఉరితీయాలని నిందితుల కుటుంబ సభ్యులతో పాటు, బాధితులు, దేశమంతట కూడా డిమాండ్ లు చేస్తున్నారు.
ముస్కాన్ కు, సౌరభ్ కు 2016 పెళ్లి జరిగింది. భార్య కోసం నేవీలో జాబ్, కుటుంబాన్ని కూడా వదిలేసి వేరే కాపురం పెట్టాడు. వీళ్లకు 2019లో పాప పుట్టింది. కొన్నినెలలకు భార్య తన స్నేహితుడితో వివాహేతర సంబంధం పెట్టుకుందని విషయం తెలిసింది. దీంతో ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి.
డైవర్స్ వరకు వెళ్లి.. కేవలం కూతురు కోసం తన మనస్సు మార్చుకున్నాడు సౌరబ్. ఆ తర్వాత మరల నేవీలో చేరిపోయాడు. తన కూతురు కోసం తరచుగా వస్తు వెళ్లేవాడు. ఇటీవల తన కూతురు బర్త్ డే నేపథ్యంలో వచ్చిన సౌరభ్ ను.. ముస్కాన్, తన ప్రియుడితో కలిసి అత్యంత క్రూరంగా హతమార్చింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe