)
Meghalaya Honeymoon Murder Case Sonam Raghuwanshi before police: మేఘాలయాలో నవదంపతుల హనీమూన్ కేసు బాలీవుడ్ క్రైమ్ సినిమాలకు మించి సంచలనం రేకెత్తిస్తుంది. నవవధువు లవ్ ఎఫైర్ లో పడి ప్రియుడి కోసం.. కట్టుకున్న భర్తను హత్య చేయించిందనే విషయం వెలుగులోకి వచ్చింది. గత పదిరోజులుగా ఈ ఘటన దేశంలో పెద్ద దుమారంగా మారింది.
మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన రాజా రఘువంశీ, సోనమ్ లకు మే 11 న పెళ్లి జరిగింది. వీరు 20 న హనీమూన్ కోసం మేఘాలయలోని షిల్లాంగ్ కు వెళ్లారు. ఆ తర్వాత.. మే 22న ద్విచక్ర వాహనాన్ని అద్దెకు తీసుకుని సోహ్రారిమ్కు వెళ్లారు. ఆ రోజు సాయంత్రం మావ్లాఖియాత్ చేరుకుని, అక్కడి నుంచి స్థానిక గైడ్ సహాయంతో నొంగ్రియాట్లోని షిపారా హోమ్స్టేలో బస చేశారు.
ఈ క్రమంలో.. మే 23న ఉదయం 10 గంటల సమయంలో రాజా, సోనమ్లు మావ్లాఖియాత్లో కనిపించారు. ఆతర్వాత నుంచి వీరిద్దరు పూర్తిగా కన్పించకుండా పొయారు. ఈ క్రమంలో నవదంపతుల కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అయితే.. 11 రోజుల తర్వాత రాజా రఘువంశీ డెడ్ బాడీ పోలీసులకు దొరికింది. దానిపై కత్తిగాయాలు ఉన్నాయి.
ఈ క్రమంలో పోలీసులు విచారణ స్పీడ్ ను పెంచారు. అయితే.. తాజాగా.. సోనమ్ యూపీలోని గాజీపూర్ పోలీసుల ఎదుట లొంగిపోయింది. ఆమె తన ప్రియుడు రాజ్ కుశ్వాహా కోసం సుపారీ ఇచ్చి గ్యాంగ్ తో మర్డర్ చేయించిందని రఘువంశీ సోదరుడు ఆరోపించాడు. పోలీసులు.. విక్కీ, ఆకాశ్, ఆనంద్ అనే ముగ్గురు అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ క్రమంలో సోనమ్ ను పోలీసులు అదుపులోకి విచారించగా.. తాను నిందితురాలిని కాదని.. బాధితురాలినని.. తనను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని ఆ తర్వాత గాజీపూర్ వదిలేసి వెళ్లారని కూడా ఆమె ఆరోపించింది. దాబా ఓనర్ ఇచ్చిన సమాచారం ప్రకారం పోలీసులు సోనమ్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో సోనమ్ పొంతనలేని సమాధానాలు చెప్తున్నట్లు సమాచారం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.