)
Mirzapur Train Accident: వరుస ప్రమాదాలు ప్రజలను బెంబేలెత్తేలా చేస్తున్నాయి. బస్సు, రైలు, విమానం ప్రయాణాల వరుసగా జరుగుతున్నాయి. ఇలా ప్రతి రోజు ప్రమాదానికి గురి కావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. నిన్న ఛత్తీస్గఢ్ బిలాస్పూర్ రైలు ప్రమాదం ఘటన మరవక ముందే మరో ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. ఉత్తర్ ప్రదేశ్ లోని మీర్జాపూర్ జిల్లాలో చునార్ రైల్వే స్టేషన్ వద్ద పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని నలుగురు ప్రయాణీకులు చనిపోయారు. ఇందులో పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. కార్తీక పౌర్ణమి సందర్భంగా నదిలో స్నానం చేయడానికి వచ్చినట్లు తెలుస్తోంది చోపాన్ ఎక్స్ప్రెస్ రైలు దిగి ట్రాక్ క్రాస్ చేస్తుండగా నేతాజీ ఎక్స్ప్రెస్ వచ్చి ఢీ కొట్టింది
ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే చనిపోయారు. వీరంతా గంగా నదిలో పవిత్ర స్నానాలు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆచరించడానికి వెళ్తున్నట్లు సమాచారం. ఇక వెంటనే రైల్వే అధికారులు, పోలీసులు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రయాణికుల భద్రత కోసం ప్లాట్ ఫామ్, ఓవర్ బ్రిడ్జిలు ఉపయోగించాలని కూడా వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో వారి మృతదేహాలు అంత ముక్కలు ముక్కలుగా చెల్లాచెదురుగా పడిపోయాయి.
ప్రమాదం జరిగిన వెంటనే పెద్ద మొత్తంలో అరుపులు, కేకలతో స్థానికంగా విషాద ఛాయలు కూడా అలుముకున్నాయి. వెంటనే ఆర్పీఎఫ్ బృందాలు కూడా అక్కడికి చేరుకొని మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం తరలిస్తున్నారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి లో చికిత్స అందిస్తున్నారు. రైల్వే స్టేషన్ ప్రమాదం గురించి తెలిసిన యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. గాయపడిన వారిని మెరుగైన చికిత్స తక్షణం అందించాలని అధికారులను ఆదేశించారు.
The incident happened at the Chunar Railway Station at nearly 9.30 am today.
Train number 13309 (Chopan - Praygraj Express) arrived at Chunar Railway Station's platform 4. Some passengers got down wrong side and attempted to trespass from main line.
Train no 12311 (Netaji… https://t.co/dhdsRZlJrJ pic.twitter.com/UNAyQ490uM
— Vani Mehrotra (@vani_mehrotra) November 5, 2025
అయితే ఈ ప్రమాదం ప్రధానంగా ఈరోజు ఉదయం 9:30 గంటలకు చోటు చేసుకున్నట్లు సమాచారం. స్థానికుల ప్రకారం రైల్ లైన్ దాటుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. యాత్రికులు గంగానది స్నానం చేయడానికి వాళ్ళు ప్యాసింజర్ రైలు దిగి ప్లాట్ ఫారం వైపుగా వెళ్లకుండా రైలు ఎదురుగా వస్తున్న మరో పట్టాల వైపుగా దాటడం వల్లే ఇలా జరిగిందని సమాచారం. ఎదురుగా వస్తున్నహౌరా కల్కా నేతాజీ ఎక్స్ప్రెస్ ఢీ కొట్టింది. దీంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇలా నిబంధనలకు విరుద్ధంగా ఫూట్ ఓవర్ బ్రిడ్జి ఉపయోగించకుండా పట్టాలు దాటడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఫూట్ ఓవర్ బ్రిడ్జి ఉపయోగించాలి లేకపోతే ఇలాంటి పెద్ద ప్రమాదాలు జరుగుతాయని అధికారులు కోరుతున్నారు. ఇక నిన్న ఛత్తీస్గఢ్ బిలాస్పూర్ రైలు ప్రమాదంలో 11 మంది చనిపోయిన సంగతి తెలిసిందే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook