
Newly brite tragedy in tamilnadu cuddalore: ఇటీవల కాలంలో కొంత మంది పెళ్లికున్న గొప్పతనాన్ని దిగజారుస్తున్నారు. పెళ్లి చేసుకుని ఒకరికి మరోకరు తోడుగా ఉంటామని చెప్పి.. ఒకరికి మరోకరు మోసాలు చేసుకుంటున్నారు. పెళ్లైన కూడా తమ ఎఫైర్ లు నడిపిస్తున్నారు. మూడు ముళ్ల బంధాన్ని నవ్వుల పాలు చేస్తున్నారు. తాజాగా.. తమిళనాడులోని కడలూరు జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.
కరువెపంపట్టికి చెందిన కలైయారసన్ అనే 27 ఏళ్ల యువకుడికి .. జన్వరి 27, 2025న ఆర్తి అనే యువతితో పెళ్లైంది. ఈ క్రమంలో అతను ఎన్నో ఆశలతో తన జీవితం ప్రారంభించాలని ప్లాన్ చేశాడు. కానీ ఆమె మాత్రం అతడికి శోభనం రోజు అనుకొని విధంగా షాక్ ఇచ్చింది. తన భర్త ముందే ప్రియుడికి ఫోన్ కాల్ చేసింది. తనకు పెళ్లి ఇష్టంలేదని తెల్చిచెప్పింది.
దీంతో అతను భార్య పనులు భరించలేక.. ఫిబ్రవరి 12న ఆమె ఇంటికి తీసుకెళ్లి వదిలేశాడు. కానీ ఆమె మాత్రం మారలేదు. ఆమె పుట్టింటి వాళ్లు మరల ఆమెను కలైయారసన్ ఇంటికి తీసుకొచ్చి వదిలేశారు. ఆమెతోనే కాపురం చేయాలని కొట్టి మరీ చెప్పారు. దీంతో షాక్ లో ఉన్న అతగాడు.. కొన్నిరోజులుగా ఇంట్లోనే ఉన్నాడు. అయితే.. ఒక రోజున తన భార్యకు తలనొప్పిగా ఉందని టీ ఇవ్వాలని చెప్పారు.
ఇంతలో ఆమె జ్యూస్ ను తీసుకొచ్చి ఇచ్చింది . అతను సంబర పడిపోయి తాగాడు. కాసేపటికి ఆమె ఆ జ్యూస్ లో విషం కలిపానని చెప్పింది. దీంతో అతను రక్తం వాంతులు చేసుకున్నాడు. వెంటనే అతడ్ని పుదుచ్చేరి ఆస్పత్రికి తీసుకెళ్లారు. అతగాడు ఐసీయూలో ప్రాణాల కోసం పొరాడుతున్నాడు. ప్రస్తుతం ఈ ఘటన తమిళనాడు నాట సంచలనంగా మారింది. ఈ క్రమంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి