Odisha Assembly: ఒడిషా అసెంబ్లీలో గందరగోళం.. బాహా బాహీకి దిగిన పాలక ప్రతిపక్ష ఎమ్మెల్యేలు..

Odisha Assembly: ఒడిశా అసెంబ్లీలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. పాలక బీజేపీ (భారతీయ జనతా పార్టీ), ప్రతిపక్ష కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బాహాబాహీకి దిగారు. దీంతో  అసెంబ్లీలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 12, 2025, 03:40 PM IST
Odisha Assembly: ఒడిషా అసెంబ్లీలో గందరగోళం.. బాహా బాహీకి దిగిన పాలక ప్రతిపక్ష ఎమ్మెల్యేలు..

Odisha Assembly:  ఒడిషాలో శాసనసభలో తీవ్ర కలకలం రేగింది. అక్కడ సుదీర్ఘ విరామం తర్వాత అధికార బిజూ జనతాదళ్ ను పడగొట్టి.. తొలిసారి ఒడిషాలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. తాజాగా అక్కడ జరిగిన శాసన సభ సమావేశాల్లో  బీజేపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బాహాబాహికి దిగారు.  ఈ క్రమంలోనే స్పీకర్ సురమా పాధ్యే సభను వాయిదా వేశారు.

Add Zee News as a Preferred Source

ఉదయం సభ ప్రారంభమైన తర్వాత పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేసీ మోహపాత్ర ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తున్నారు. ఈ సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహినీపతి మంత్రి ముందుకు వెళ్లి నిల్చున్నారు. దీంతో బీజేపీ ఎమ్మెల్యే జయనారాయణ మిశ్రా ఒక్కసారిగా అటువైపు దూసుకెళ్లి కాంగ్రెస్ సభ్యుడుని పట్టుకున్నారు.  

ఇదీ చదవండి:   అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.  

ట్రెజరీ బెంచీలో సభ్యులు సహా బీజేపీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ సభ్యుడు అక్కడి దూసుకెళ్లి ఘర్షణ పడ్డారు. ఒకరినొకరు తోసుకోవడంతో  సభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. బిజూ జనతాదళ్ పార్టీ సభ్యులు స్పీకర్ ముందు వెల్‎లో నిరసన వ్యక్తం చేస్తున్నప్పటికీ వారు ఈ ఘర్షణలో కలుగజేసుకోలేదు. సభ అదుపు తప్పడంతో స్పీకర్‌  వాయిదా వేశారు.

ఇదీ చదవండి:  నిహారిక మళ్లీ పెళ్లి కూతురు అవుతుందోచ్.. పెళ్లి కొడుకు ఫిక్స్..?

ఇదీ చదవండి: టబుకు అన్న ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా.. ! అస్సలు ఎక్స్ పెక్ట్ చేయరు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News