Odisha Assembly: ఒడిషాలో శాసనసభలో తీవ్ర కలకలం రేగింది. అక్కడ సుదీర్ఘ విరామం తర్వాత అధికార బిజూ జనతాదళ్ ను పడగొట్టి.. తొలిసారి ఒడిషాలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. తాజాగా అక్కడ జరిగిన శాసన సభ సమావేశాల్లో బీజేపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బాహాబాహికి దిగారు. ఈ క్రమంలోనే స్పీకర్ సురమా పాధ్యే సభను వాయిదా వేశారు.
ఉదయం సభ ప్రారంభమైన తర్వాత పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేసీ మోహపాత్ర ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తున్నారు. ఈ సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహినీపతి మంత్రి ముందుకు వెళ్లి నిల్చున్నారు. దీంతో బీజేపీ ఎమ్మెల్యే జయనారాయణ మిశ్రా ఒక్కసారిగా అటువైపు దూసుకెళ్లి కాంగ్రెస్ సభ్యుడుని పట్టుకున్నారు.
ఇదీ చదవండి: అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.
ట్రెజరీ బెంచీలో సభ్యులు సహా బీజేపీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ సభ్యుడు అక్కడి దూసుకెళ్లి ఘర్షణ పడ్డారు. ఒకరినొకరు తోసుకోవడంతో సభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. బిజూ జనతాదళ్ పార్టీ సభ్యులు స్పీకర్ ముందు వెల్లో నిరసన వ్యక్తం చేస్తున్నప్పటికీ వారు ఈ ఘర్షణలో కలుగజేసుకోలేదు. సభ అదుపు తప్పడంతో స్పీకర్ వాయిదా వేశారు.
ఇదీ చదవండి: నిహారిక మళ్లీ పెళ్లి కూతురు అవుతుందోచ్.. పెళ్లి కొడుకు ఫిక్స్..?
ఇదీ చదవండి: టబుకు అన్న ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా.. ! అస్సలు ఎక్స్ పెక్ట్ చేయరు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









