)
Online Gaming Suicide: ఆన్లైన్ గేమింగ్లో రూ.13 లక్షలు పోగొట్టాడో ఆరో తరగతి విద్యార్థి. అయితే అప్పటికీ తన తండ్రి పెద్దగా మందలించలేదు. కానీ, తప్పు చేశానని గమనించిన ఆ విద్యార్థి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఉత్తరప్రదేశ్లోని లక్నోలోని మోహన్ లాల్గంజ్ ప్రాంతంలో ఒక విషాద సంఘటన వెలుగులోకి వచ్చింది. స్థానిక బిఐపిఎస్ స్కూల్లో 6వ తరగతి చదువుతున్న యష్ కుమార్ అనే విద్యార్థి ఆన్లైన్ గేమ్లో రూ.13 లక్షలు పోగొట్టాడు. వాళ్ల తండ్రికి చెందిన డబ్బును ఇలా వృథా చేయడం వల్ల భయపడిపోయిన ఆ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. యష్ తండ్రి సురేష్ కుమార్ యాదవ్ పెయింటర్గా పనిచేస్తున్నాడు. అతను రెండేళ్ల క్రితం ఆ భూమిని అమ్మి యూనియన్ బ్యాంక్ బిజోర్ బ్రాంచ్లో రూ.13 లక్షలు డిపాజిట్ చేశాడు.
ఇటీవల తన పాస్బుక్ను అప్డేట్ చేసిన తర్వాత, తన ఖాతా నుండి రూ.13 లక్షలు కట్ అయినట్లు అతనికి తెలిసింది. దీంతో అతను షాక్ అయ్యాడు. తర్వాత దర్యాప్తులో ఈ ఆన్లైన్ గేమింగ్లో ఈ డబ్బు కట్ అయినట్లు తేలింది. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత సురేష్ తన కొడుకు యష్ను దీని గురించి ప్రశ్నించాడు. మొదట తనకు దీని గురించి ఏమీ తెలియదని చెప్పాడు. తర్వాత ఫ్రీ ఫైర్ గేమ్ ఆడుతూ డబ్బు అంతా పోగొట్టుకున్నానని ఒప్పుకున్నాడు.
ఆన్లైన్ గేమింగ్లో భారీ మొత్తంలో డబ్బు పోగొట్టుకున్నప్పటికీ, తండ్రి ఎప్పుడూ తన కొడుకును తిట్టలేదు. కానీ తాను పెద్ద తప్పు చేశానని గ్రహించిన యష్ తన గదిలోకి వెళ్లి ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
కుటుంబ సభ్యులు వెంటనే యష్ను సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అక్కడికి చేరుకునే లోపే అతను మృతి చెందినట్లు ప్రకటించారు. దీని గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం తరలించారు. ఈ దిగ్భ్రాంతికరమైన సంఘటనతో గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది. ఆన్లైన్ గేమింగ్ కారణంగా తమ కొడుకు ప్రాణం, డబ్బు పోయాయని యష్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook