man controvery comments on navy officer vinay narwal wife: జమ్ములోని అనంత్ నాగ్ జిల్లాలో ఉగ్రమూకలు రెచ్చిపోయారు. అడవుల్లో నుంచి పహాల్గంకు వచ్చి.. ఆర్మీ దుస్తులో అక్కడున్న టూరిస్టులను పిట్టల్లా కాల్చి పైశాచీక అనందం పొందారు. ముఖ్యంగా హిందువుల్ని టార్గెట్ గా చేసుకుని కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలనో 26 మంది ప్రాణాలు కొల్పోగా.. 20 మందికిపైగా ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు.
ఇదిలా ఉండగా.. ఈ ఘటనపై ఒక వ్యక్తి చేసిన కామెంట్స్ ప్రస్తుతం వివాదాస్పదంగా మారాయి. ఈ క్రమంలో హర్యానాకు చెందిన ఆర్మీఅధికారి వినయ్ నర్వాల్, హిమాన్షి కొత్త జంట ఘటన దేశాన్ని కలిచి వేసింది. ఏప్రిల్ 16న వీళ్ల పెరిజరిగింది. ఆతర్వాత 19న రిసెప్షన్ చేసుకున్నారు. ఆ తర్వాత హనీమూన్ కు వచ్చిన ఈ జంట విగత జీవుల్లా మారిపోయారు. అయితే.. ఈ ఘటన దేశంలో ప్రతి ఒక్కర్ని కలిచివేసింది.
కనీసం కాళ్ల పారణి ఆరక ముందే నవవధువు తన కళ్ల ముందే భర్తను కోల్పోయింది. దీనిపై దేశమంతట కూడా కన్నీళ్లను పెట్టుకున్నారు. అయితే.. ఈ ఘటనపై ఒక వ్యక్తి నీచంగా మాట్లాడాడు. అసలు.. ఆమెకు ఈ పెళ్లి ఇష్టముందో లేదో.. లేదా.. ఏదైన స్కెచ్ వేసి ఉంటుందని ఈ ఘటన ఉన్న ఫోటో కింద కామెంట్లు చేశారు.
ఆమె షూటర్ ను ఏర్పాటు చేసి తన భర్తను చంపించి ఉంటుంది కాబోలు అని కామెంట్లు చేశాడు. ఈ ఘటనపై దర్యాప్తు జరిపించాలన్నాడు. దీంతో ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. దీంతో ఇది కాస్త పోలీసుల వరకు వెళ్లింది. పోలీసులు.. అభయ్ శ్రీ వాస్తవ్ అనేు వ్యక్తిని అరెస్ట్ చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









