Singer Neha Singh: దేశానికి వ్యతిరేకంగా లేడీ సింగర్ పోస్ట్‌లు.. దేశ ద్రోహం కేసు.. ఏమనిందంటే..?

Pahalgam Terror Attack: పహల్గం ఘటనపై ప్రస్తుతం భారత్ చాలా సీరియస్ గా ఉంది. ఈ క్రమంలో ప్రస్తుతం యూపీకి చెందిన లేడీ సింగర్ నేహసింగ్ కాంట్రవర్సీ పోస్ట్ లు దేశంలో సంచలనంగా మారాయి. దీంతో యూపీ పోలీసులు దేశద్రోహాం కేసును నమోదు చేశారు.  

Written by - Inamdar Paresh | Last Updated : Apr 28, 2025, 04:55 PM IST
  • లేడీ సింగర్ పై దేశద్రోహం కేసు..
  • సీరియస్ అయిన యూపీ పోలీసులు..
Singer Neha Singh: దేశానికి వ్యతిరేకంగా లేడీ సింగర్ పోస్ట్‌లు.. దేశ ద్రోహం కేసు.. ఏమనిందంటే..?

 sedition Case on Bhojpuri singer neha singh rathore: జమ్ములోని పహల్గంలో చోటు చేసుకున్న ఉగ్రఘటనను భారత్ ఎంతో సీరియస్ గా తీసుకుంది. ఇప్పటికే భారత్ ను ప్రపంచ దేశాల ముందు దోషిగా నిలబెట్టేపనులు చేస్తుంది. ఇప్పటికే  సింధు జలాల ఒప్పందంను రద్దు చేసింది. పాక్ వీసాలను రద్దు చేసింది. అటారీ బార్డర్ ను క్లోజ్ చేసింది. అంతటితో ఆగకుండా.. సరిహద్దులో భారీగా త్రివిధ దళాల సైన్యంను మోహరించింది. ఇప్పటికే భారత్ దెబ్బకు పాక్ లోపల భయపడిపోతున్న కూడా.. పైకి మాత్రం ఏదో మేకపోతు గాంభీర్యం చూపిస్తుంది.

ఈ క్రమంలో ప్రస్తుతం యావత్ భారత్ దేశం పాక్ పై చర్యలు తీసుకొవాలని, మోదీ సర్కారు తీసుకునే ప్రతి చర్యలకు తాము అండగా నిలుస్తామని భారతీయులు అంటున్నారు. కానీ మరోవైపు మాత్రం కొంత మంది తిన్నింటి వాసలు లెక్కపెట్టినట్లు, భారత్లో ఉంటూ భారత మాతకు వెన్నుపొటు పొడుస్తున్నారు.ఈ క్రమంలో ప్రస్తుతం..  ఉత్తర ప్రదేశ్ కు చెందిన జానపద గాయని నేహసింగ్ రాథోడ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. నేహసింగ్ ఇటీవల పహల్గం ఘటనపై సోషల్ మీడియాలో రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసింది.

అంతే కాకుండా.. 2019 పుల్వామా దాడిని ఎన్నికలలో మోదీ వాడుకున్నారని, ఇప్పుడు పహల్గం ఘటనను బీహర్ లో  ఓట్లకు అస్త్రంగా ఉపయోగించుకున్నారని  పోస్ట్ లు పెట్టారు. అంతేకాకుండా.. ఆయన రష్యా, ఉక్రెయిన్ యుద్దాన్ని ఆపగలరు కానీ.. ఉగ్రవాదుల దాడుల్ని గుర్తించలేరా అంటూ పోస్ట్ చేసింది.

Read more: Pahalgam Terror Attack: వద్దు బ్రో.. భారత్‌తో అస్సలు పెట్టుకొవద్దు.!.. పాక్ ప్రధానికి నవాజ్ షరీఫ్ సూచన..

దీంతో ఈ పోస్ట్ లను పాక్ జర్నలిస్టులు తెగ వైరల్ చేశారు.  పాక్ ను సొంత దేశస్థులే ఈ విధంగా తప్పు పడుతున్నారని ఘటనను.. అందరికి తెలిసేలా చేస్తున్నారు. కొందరు ఏకంగా ప్రధాని మోదీకి చేరేలా రీట్విట్ లు చేశారు. దీంతో ఈ ఘటనపై యూపీలోని అభయ్ సింగ్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.దీంతో దేశ సమగ్రత,ఉపవర్గంను రెచ్చగొట్టేలా పోస్టులు ఉండటంతో పోలీసులు లేడీ సింగర్ నేహసింగ్ పై దేశద్రోహాం కేసును నమోదు చేశారు.

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News