Pahalgam Terror Attack: భారత స్విట్జర్లాండ్ అయిన పహల్గామ్ లో అమాయక భారతీయులపై ఉగ్రవాదులు పాశవికంగా దాడి చేసి చంపిన ఘటనపై దేశ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. దాడిలో మరణించిన వారి మృత దేహాలు స్వస్థలాలకు చేరుతున్నాయి. ఈ నేపథ్యంలో నేవీ లెఫ్టినెంట్ ఆఫీసర్ వినయ్ నర్వాల్ మృత దేహం ఇంటికి చేరుకుంది.
ఆయన పార్ధివ దేహానికి హరియాణా సీఎం నయాబ్ సింగ్ సైనీ నివాళులు అర్పించారు. వినయ్ కుటుంబ సభ్యలను ఓదార్చారు. అదే సమయంలో వినయ్ నర్వాల్ సోదరి కన్నీటి పర్యంతమయ్యారు. కాల్పుల తరువాత గంటన్నర పాటు తమ సోదరుడు బతికే ఉన్నాడన్నారు. కానీ ఆ సమయంలో ఎలాంటి సాయం అందలేదని వాపోయారు.
ఎవరైనా సాయం అందిస్తే బతికే వుండేవాడని వాపోయారు. తన సోదరుడు ముస్లీం కాదని తెలిసి 3 సార్లు కాల్చారని చెప్పారు. అతడిని చంపిన ఉగ్రవాది తల కావాలని, వినయ్కు న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. మరోవైపు దేశ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ తో పాటు ఏపీలో జనసేన కార్యకర్తలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అటు హైదరాబాద్ ముస్లిమ్ పార్టీ అయిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా తన పార్టీ కార్యకర్తలతో కలిసి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.
ఇదీ చదవండి: బడా స్టార్స్ సహా 900 సినిమాల్లో నటించిన నటి.. భర్త చనిపోవడంతో తాగుడుకు బానిసై జీవితం నాశనం..
ఇదీ చదవండి: ఈ చెట్లు ఉంటే.. పాములకు మీ ఇంట్లోకి రెడ్ కార్పెట్ పరిచినట్టే.. తస్మాత్ జాగ్రత్త..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









