)
man beaten to death by mob in mangaluru: పహల్గం ఘటనపై దేశమంతా ఆగ్రహంతో ఊగిపోతుంది. అమాయకులైన భారతీయ హిందు టూరిస్టులను టార్గెట్ చేసుకుని ఉగ్రమూకలు మారణ హోమంచేశారు. ఇష్టమున్నట్లు కాల్పులు జరిపి ఎంతో మందికి కడుపుకోతను మిగిల్చారు. దీనిపై ఇప్పటికే భారత్ దాయాది పాక్ కు ముప్పుతిప్పలు పెడుతుంది. దేశంలోని ప్రజలంతా.. కేంద్రానికి తమ సంఘీభావం తెలియజేస్తున్నారు.
ఉగ్రమూకల పీచం అణచాలని ప్రధాని మోదీని కోరుతున్నారు. ఇదిలా ఉండగా.. 26 మంది అమాయకులు, హిందువులే టార్గెట్ గా చనిపోయిన ఇప్పటికి కొంత మంది నీచులు .. భారత్లో ఉంటూ దాయాదికి అనుకూలంగా మాట్లాడుతున్నారు. దీనిపై భారతీయులంతా రగిలిపొతున్నారు. ఈక్రమంలో కర్ణాటకలోని మంగళూరులో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఏప్రిల్ 27న కుడుపు ప్రాంతంలోని భత్రా కల్గుర్తి ఆలయం సమీపంలో.. లోకల్ క్రికెట్ మ్యాచ్ జరిగింది.
దీనిలో పదిజట్లు, దాదాపు.. 100 మందికి పైగా ప్లేయర్స్ పాల్గొన్నారు. అయితే.. ఆదివారం జరిగిన మ్యాచ్ నేపథ్యంలో.. ఒక యువకుడు పాక్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశాడు. దీంతో అక్కడున్న వారంత.. అతడ్ని చితక్కొట్టారు. వారి దెబ్బలకు తాళలేక అతను అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు.
వెంటనే అతడ్ని అక్కడున్న వారు ఆస్పత్రికి తరలించారు. అతను చికిత్స పొందుతూ తాజాగా.. చనిపోయాడని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై.. కర్ణాటక హోంమంత్రి పరమేశ్వరన్ మాట్లాడారు. చట్టాన్ని ఎవరు కూడా తమ చేతుల్లో తీసుకొవద్దని అన్నారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు పోలీసులు 15 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe