Pahalgam Terror Attack: జమ్ముకశ్మీర్ లోని పహల్గంలో జరిగిన ఉగ్రచర్యను యావత్ భారతవణి ఖండించింది. దీనిపై కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వం కూడా పాక్ ను అష్టదిగ్బంధనంచేస్తుంది. ఇదిలా ఉండగా.. పాక్ మాత్రం తన వంకర బుద్దిని మార్చుకొవడం లేదు. ఇప్పటికే భారత్ సింధు జలలా ఒప్పందం, వీసాలను తిరస్కరించింది. పాక్ దేశీయులను వెళ్లిపోవాలని ఆదేశించింది.
ఇదిలా ఉండగా.. పాక్ ఆర్మీ.. కొన్నిరోజులుగా భారత్ ను రెచ్చగొట్టేపనులు చేస్తుంది. నియంత్రణ రేఖ వెంబడి మరోసారి తాజాగా.. కాల్పులు చోటు చేసుకున్నాయి. భారత్ లోని సైనికులు టార్గెట్ గా పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. తాజాగా.. పాక్ కుప్వారా, పూంఛ్ జిల్లాల బార్డర్ లో కాల్పులకు తెగబడింది. అంతే కాకుండా.. దీంతో భారత్ కూడా పాక్ కు గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. ప్రస్తుతం వరుసగా నాలుగో రోజు పాక్ కాల్పులకు తెగబడింది.
మొత్తంగా పూంచ్ సెక్టార్ లో పాక్ కాల్పుల విరమణ ఒప్పందంను ఉల్లంఘించడం తొలిసారి అని భారత్ అధికారులు చెబుతున్నారు. అయితే.. ఏప్రిల్ 22న జరిగిన పహల్గం ఉగ్రఘటనను యావత్ దేశం తీవ్రంగా పరిగణించింది. ఆర్మీదుస్తుల్లో వచ్చి అమాయకులపై టూరిస్టులపై ఉగ్రమూకలు కాల్పులకు తెగబడ్డారు.
Read more:Seema Haidar: భారత్ , పాక్ ల మధ్య ఉద్రిక్తతలు... సంచలన నిర్ణయం తీసుకున్న సీమా హైదర్..
ఈ ఘటనలోన 25 మంది తమ ప్రాణాలు కోల్పోయారు. హిందువులే టార్గెట్ గా చేసుకుని ఈ కాల్పులు జరిగాయి. అయితే.. ప్రస్తుతం అమెరికా, ఇజ్రాయేల్, ఫ్రాన్స్ భారత్ కు ఉగ్రవాదంకు వ్యతిరేకంగా సంఘీ భావం తెలిపారు. మరోవైపు డ్రాగన్ కంట్రీ మాత్రం మళ్లీ పాక్ కు తమ సపోర్ట్ ఉంటుందని చెప్పడం ప్రస్తుతం ఒకింత ఆందోళన చెందించేదిగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









