Pak Army Chief Asim Munir: కుట్రను వారం ముందే చెప్పిన పాక్ ఆర్మీ చీఫ్..?.. భారత్ ఇంటెలిజెన్స్ లైట్ తీసుకున్నారా..?..

Pahalgam Terror Attack: పహల్గాం ఉగ్రకుట్రవెనుక పాక్ ఆర్మీ హస్తం ఉందని ప్రస్తుతం అనేక అంశాలు తెరమీదకు వస్తున్నాయి. వారం క్రితం పాక్ ఆర్మీజనరల్ మునీర్ ఒక సమావేశంలో మాట్లాడుతూ..  కశ్మీర్ లో హిందువుల్ని, ముస్లింలను వేర్వేరుగా చూస్తారని అన్నాడు.  

Written by - Inamdar Paresh | Last Updated : Apr 23, 2025, 02:08 PM IST
  • కాంట్రవర్సీగా మాట్లాడిన పాక్ ఆర్మీ చీఫ్..
  • రగిలిపోతున్న భారతీయులు..
Pak Army Chief Asim Munir: కుట్రను వారం ముందే చెప్పిన పాక్ ఆర్మీ చీఫ్..?.. భారత్  ఇంటెలిజెన్స్ లైట్ తీసుకున్నారా..?..

Pakistan Army Chief asim munir Hindu hate speech: జమ్ములోని పహాల్గంలో ఉగ్రకుట్ర ప్రస్తుతం దేశంలో అందరిని కలిచివేసింది. అమాయకులైన టూరిస్టులపై ఉగ్రవాదులు అడవుల్లో నుంచి ఆర్మీదుస్తుల్లో వచ్చి మరీ.. టూరిస్టుల ఐడెంటీ కార్డులు చూసి హిందువులపై పాయింగ్ బ్లాంక్ లో గన్ తో కాల్చిచంపారు. అయితే.. ఈ ఘటనలో ఇప్పటి వరకు.. 30 మందికి పైగా టూరిస్టులు, మరో 20 మందికి పైగా సీరియస్ కండీషన్ లో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాయి.

 

అయితే.. దీనిపై ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా త్రివిధ దళాల అధికారులు సమావేశం అయ్యారు. ఉగ్రఘటనను ఖండిచడంతో  పాటు.. తదుపరి చర్యలపై కూడా పలు నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తొంది. అయితే... ఈ ఘటన గురించి భారత్ ఇంటెలీజెన్స్ అధికారులు ముందే గుర్తించలేక పోయారా..?.. ఒక వేళ చెప్పిన కూడా.. బలగాలు ఎందుకంతా లైట్ గా తీసుకున్నాయని ప్రస్తుతం దేశంలో పెద్ద వివాదం దుమారం చెలరేగింది.

మరోవైపు పాక్ ఆర్మీ జనరల్.. వారం క్రితం.. ఒక సమావేశంలో మాట్లాడుతూ... కాశ్మీర్ సోదరులను మేం మర్చిపోలేమని, వాళ్లకోసం నిరంతరం పోరాడుతూ ఉంటామని అసిమ్ మునీర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. అదే విధంగా కశ్మీర్ కు అన్నివిధాలుగా ఉండగా ఉంటామన్నారు. అదే విధంగా.. హిందువులతో పోలీస్తే పాకిస్తానీలు భిన్నమన్నారు.  కావాలని  హిందువులు, ముస్లింలు అంటూ మరోసారి ఇరు వర్గాల మధ్య చిచ్చు పెట్టేలా వ్యాఖ్యలు చేశారు.

భారత్, పాక్ విభజన గురించి మాట్లాడారు. అంతే కాకుండా..జాతివ్యతిరేక సిద్ధాంతం గురించి ప్రస్తావించారు. అయితే.. ఈ వ్యాఖ్యల్ని భారత్ ఖండించింది.కానీ.. అప్పుడు అధికారులు కనుక.. ఉన్నట్టుండి.. ఈయన ఎందుకు ఇలాంటి కాంట్రవర్సీ మాటలు మాట్లాడుతున్నాడు..?.. దీని వెనుక ఉగ్రకోణం ఉందా..అని ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకుంటే.. ఈరోజు పహాల్గంలో నగమేధం జరిగేది కాదని మేధావులు అంటున్నారు.

Read more: Pahalgam Terror Attack: ఉగ్రదాడి నుంచి బైటపడ్డ సెలబ్రిటీ జంట.. ఆ పోస్ట్‌పై రగిలిపోతున్న నెటిజన్లు..  

అయితే..ఈ ఘటనను ప్రపంచ దేశాలు సైతం ముక్త కంఠంలో ఖండిస్తున్నాయి. ఇది హేయమైన చర్య, పిరికి పందచర్యగా అభివర్ణిస్తున్నాయి.  మరోవైపు దీనిపై తప్పకుండా.. రీవెంజ్ ఉండాల్సిందేనని.. భారత్ ప్రజలు  కేంద్ర ప్రభుత్వంను డిమాండ్ చేస్తున్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News