Pahalgam Terror Attack: వాళ్లు స్వాతంత్ర సమరయోధులు.. ఉగ్రదాడి దుర్మార్గులపై పాక్ ఉప ప్రధాని ప్రశంసలు.. రగిలిపోతున్న భారత్..

Pak deputy cm controversy comments: పహాల్గం ఉగ్రదాడికి పాల్పడిన వారంత ఫ్రీడమ్ ఫైటర్స్ అంటూ పాక్ డిప్యూటీ పీఎం చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. దీనిపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. వాళ్లకు బుద్ది చెప్పాల్సిందే అంటూ భారతీయులు  ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నారు.  

Written by - Inamdar Paresh | Last Updated : Apr 25, 2025, 12:47 PM IST
  • పాక్ డిప్యూటీ పీఎం కాంట్రవర్సీ కామెంట్స్..
  • కోపంలో రగిలిపోయిన భారతీయులు..
Pahalgam Terror Attack: వాళ్లు స్వాతంత్ర సమరయోధులు.. ఉగ్రదాడి దుర్మార్గులపై పాక్ ఉప ప్రధాని ప్రశంసలు.. రగిలిపోతున్న భారత్..

Pakistan deputy pm ishaqdar  controversy: జమ్ములోని పహల్గం చూసేందుకు వచ్చిన అమాయకులైన టూరిస్టులపై ఉగ్రమూకలు కాల్పులకు పాల్పడి మారణ హోమం చేశారు.  కళ్ల ముందే తమ వాళ్లను కాల్చి చంపుతూ పైశాచిక ఆనందం పొందారు. ముఖ్యంగా హిందువులను టార్గెట్ చేసుకుని ఉగ్రవాదులు కాల్పులు చేశారు. ఆర్మీదుస్తులల్లో వచ్చి టూరిస్టులను కాల్చిచంపారు.ఈ క్రమంలో ప్రస్తుతం భారత్ పాక్ పై ఉక్కుపాదం మోపుతుంది.

ఈ ఘటనను యావత్ భారత్ వణీ ఖండిస్తుంది.  ప్రజలంతా ఈ ఘటనలో అమాయకుల ప్రాణాలు తీసిన వాళ్లను, వారి వెనుకాల ఉన్నవారిని అస్సలు వదలేది లేదని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే కేంద్రం దీనిపై చాలా సీరియస్ గా ఉంది . ప్రధాని కెబినెట్, హైపవర్ అధికారులతో మీటింగ్ నిర్వహించారు. పాక్ ను అష్టదిగ్భంధనం చేశారు. ఇండియాలో ఉన్న పాక్ వాళ్లను వెళ్లిపోవాలని ఆదేశించింది.

అటారీ బార్డర్ ను క్లోజ్ చేసింది. ముఖ్యంగా సింధు జలాల ఒప్పందం ను రద్దు చేసుకుంది. పాక్ వీసాలను రద్దు చేసింది. దౌత్యధికారుల సంఖ్యను కుదించింది.ఈ  క్రమంలో రెండు దేశాల మధ్య యుద్ద వాతావరణం చోటు చేసుకుంది. మరోవైపు పాక్ కూడా భారత్ కు కౌంటర్ గా మేకపోతు గాంభీర్యంను చూపిస్తు.. భారత్ తీసుకున్న కొన్ని నిర్ణయాలను కాపీకొట్టింది. అయితే.. మొత్తంగా.. పాక్ , భారత్ ల మధ్య యుద్ద వాతావరణం ప్రపంచంలో చర్చనీయంశంగా మారింది.

ఇదిలా ఉండగా.. పాక్ ఉప ప్రధాని తాజాగా.. ఇషాక్ దార్ చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యంపోసేవిగా మారాయి.  పాక్ డిప్యూటీ ప్రధాని ఇషాక్ దార్ మాట్లాడుతు.. పహల్గంలో పాల్గొన్న ఉగ్రవాదుల్ని స్వాతంత్ర సమరయోధులతో పొల్చాడు. అంతే కాకుండా.. వారంతా దేశం కోసంపోరాడిన ఫ్రీడమ్ ఫైటర్స్ అంటూ ప్రశంసలు కురిపించారు. ఈ స్టేట్ మెంట్ ప్రస్తుతం  అసలే.. కోపంతో రగిలిపోతున్న భారత్ కు అగ్నికి ఆజ్యం పోసినట్లైంది.

Read more: Pakistan Opens Fire: సీజ్‌ఫైర్‌ ఎత్తివేత.. కాల్పులు ప్రారంభించిన పాకిస్తాన్‌..!

పాక్ ఉప ప్రధాని చేసిన కామెంట్స్ లను భారతీయులు ఖండిస్తున్నారు. మరోవైపు.. ఇప్పటికే.. సింధుజలాల ఒప్పందం రద్దుచేస్తున్నట్లు భారత్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో నీటివనరుల కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ.. పాక్ అధికారి సయిద్ అలీ ముర్తుజాకు లేఖను పంపారు.

Read more: Seema Haidar: అయ్యయ్యో.. ప్రియుడి కోసం వచ్చిన సీమాహైదర్ పరిస్థితి.. పాక్‌కు వెళ్లాల్సిందేనా..?

 ఏ ఒప్పందం అయిన నిజాయితీగా అమలు చేయాలి.. కానీ పాక్ మాత్రం సీమాంతర ఉగ్రవాదంను ప్రొత్సహిస్తు భారత్ కు కవ్వింపుల చర్యలకు పాల్పడుతుంది. అందుకే సింధు జలాల ఒప్పందం రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News