Shehbaz Sharif: పహల్గం ఘటన.. పాక్ ప్రధాని ఫస్ట్ రియాక్షన్.. ఏమన్నాడంటే..?

Pahalgam Terror Attack: పహల్గం ఘటనపై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తొలిసారి స్పందించారు. ఈ ఘటనపై తాము తటస్థమైన విచారణకు రెడీ అని చెప్పుకొచ్చారు.  

Written by - Inamdar Paresh | Last Updated : Apr 26, 2025, 12:29 PM IST
  • పహల్గం ఘటనపై రియాక్ట్ అయిన పాక్ పీఎం..
  • మళ్లీ అసత్యాలే..
Shehbaz Sharif: పహల్గం ఘటన.. పాక్ ప్రధాని ఫస్ట్ రియాక్షన్.. ఏమన్నాడంటే..?

Pak pm shehbaz sharif reacts On Pahalgam Terror Attack: పహల్గం ఘటనపై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తొలిసారి స్పందించారు.ఈ ఘటనపై భారత్.. పాక్ పై నిరాధార ఆరోపణలు చేస్తుందన్నారు. అదే విధంగా ఎలాంటి చర్యలు ఎదుర్కొనేందుకు అయిన తాము సిద్దమని ప్రగల్గాలు పలికాడు.

Add Zee News as a Preferred Source

అంతే కాకుండా.. దీనిపై పూర్తిస్థాయిలో న్యూట్రల్ విచారణకు సిద్దమన్నారు. ఈ క్రమంలో పహల్గం ఘటన జరిగిప్పటి నుంచి పాక్ ప్రధాని దీనిపైన తొలిసారి ఈ విధంగా మాట్లాడారు. ఇప్పటికే పాక్ ఉపప్రధాని, మంత్రులు భారత్ ను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. పాక్ అడ్డాంగా దొరికిపోయిన కూడా.. తప్పుచేయలేదని చెప్పడం కొత్తకాదని భారత్ ఈ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించింది.

 ఇదిలా ఉండగా.. ఖైబర్ పఖ్తుంఖ్వాలోని పాక్ మిలిటరీ అకాడమి గ్రాడ్యూయేషన్ వేడుకల్లో పాక్ ప్రధాని  పాల్గొన్నారు. ఈ క్రమంలో భారత్, పాక్ ల మధ్య ఏర్పడిన ఉద్రిక్తతలపై మాట్లాడారు.  పహల్గం ఘటనతో మనదేశం నిందలు ఎదుర్కొంటుందన్నారు. ఈ ఘటనపై తటస్థ, పారదర్శక , విచారణకు సిద్దమన్నారు. తమ దేశం శాంతికి ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఉగ్రవాదాన్ని తాము కూడా ఖండిస్తున్నామని చెప్పారు.  

Read more: Pahalgam Attack: పాకిస్తాన్‌ డీఎన్‌ఏలోనే ఉగ్రవాదం.. గొంతు కోస్తా అంటూ భారతీయులకు పాక్‌ అధికారి వార్నింగ్‌..

అదే విధంగా భారత్ ప్రధాని చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా తమ దేశ సార్వభౌమత్వంపై రాజీ పడేది లేదన్నారు.  తమదేశం కోసం ఎలాంటి ముప్పు అయిన ఎదుర్కొనేందుకు సిద్దమన్నారు. సింధు జలాల ఒప్పందపై మాట్లాడుతూ.. భారత్ ఏకపక్షంగా ఈ నిర్ణయం తీసుకొవడం సరికాదన్నారు. చర్చల ద్వారా సమస్యల్ని పరిష్కరించుకొవాలని తాము కోరుకుంటున్నట్లు భారత్ ను మళ్లీ నిందించే ప్రయత్నంను పాక్ ప్రధాని చేశాడు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News