)
Pakistan violates ceasefire in jammu and Kashmir poonch: భారత్ , పాక్ ల మధ్య పహల్గం ఉగ్రఘటన తర్వాత భీకరమైర యుద్దం జరిగింది. ఇండియన్ ఆర్మీ ముందు పాక్.. మూడు రోజుల్లోనే చెతులెత్తేసింది. ఆపరేషన్ సిందూర్ తో భారత్ పాక్ కు చుక్కలు చూపించింది. అన్నిరకాలుగా కూడా అష్టదిగ్బంధనం చేసి భారత్ జోలికి రావాలంటేనే వెన్నులో వణుకు పుట్టేలా చేసింది.
ఈ క్రమంలో పాక్ ఆర్మీ.. భారత్ ఆర్మీ తో మాట్లాడి సీజ్ ఫైర్ ఒప్పందం చేసుకుందామని ముందు ప్రతిపాదన తీసుకొచ్చారు. దీంతో ఇండియన్ ఆర్మీ దీనికి అంగీకరించింది. అప్పటి నుంచి భారత్,పాక్ ల మధ్య బార్డర్ లో కాల్పులు జరగలేదు. కానీ ఈ రోజు మాత్రం పాక్ మరోసారి తన వంకర బుద్దిని బైటపెట్టింది. పూంచ్ పరిధిలో కాల్పులకు తెగబడింది. ఇండియన్ ఆర్మీ కూడా పాక్ కు ధీటుగా బదులిచ్చింది.
ఈ క్రమంలో దాదాపు 15 నిమిషాల పాటు దాయాది కాల్పులు జరిపింది. ఆపరేషన్ సిందూర్ కాల్పుల విరమణ తర్వాత పాక్ తన వంకర బుద్ది చూపించినందుకు.. సర్వాత్ర విమర్శలు వస్తున్నాయి.
ఒక వైపు ఇటీవల ట్రంప్ భారత్ తో కయ్యానికి కాలుదువ్వుతున్న వేళ.. పాక్ కాల్పులు జరపడంపై భారత్ నిశితంగా పరిశీలిస్తుంది. ఈ క్రమంలో బార్డర్ లో ఉన్న ఇండియన్ ఆర్మీ అలర్ట్ అయ్యింది. మరిన్ని భద్రత బలగాలను అధికారులు అప్రమత్తం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి