
Merchant navy officer murder case: ప్రస్తుతం సమాజంలో కొంత మంది వివాహ బంధానికి ఉన్న గొప్పతనాన్ని పూర్తిగా దిగజారుస్తున్నారు. పెళ్లి చేసుకుని ఒకరికి మరోకరు అండగా ఉంటామని చెప్పి.. తీరా పెళ్లైన తర్వాత దంపతులు అనేక నీచపు పనులు చేస్తున్నారు. పెళ్లైన తర్వాత ఏవో గొడవలు రావడం మాత్రం కామన్ గా చెప్పుకొవచ్చు. కానీ దీన్ని కొంతమంది మాట్లాడుకుని పరిష్కరించుకుంటున్నారు.కానీ ఇంకొందరు మాత్రం.. పంచాయతీలు పెట్టుకుంటుకుంటున్నారు.
కొన్నిచోట్ల భార్యలు, భర్తలు కూడా ఎఫైర్ లుపెట్టుకుంటున్నారు. వివాహేతర సంబంధాలతో తాము పెళ్లి చేసుకున్న వాళ్లను హత్యలు కూడా చేస్తున్నారు. దీంతో సమాజంలో చాలా మంది ఇటీవల పెళ్లి అంటేనే ఆమడ దూరం పారిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల చాలా మంది టెకీలు భార్యల వేధింపులను భరించలేక ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ క్రమంలో తాజాగా.. ఉత్తర ప్రదేశ్ లోని మేరట్లో మరో ఘోరం వెలుగులోకి వచ్చింది.
She deleted her husband for this guy.
Then they went to Shimla, got married, and had fun for 12 days before finally being arrested. pic.twitter.com/SUSxlKWlg8
— ︎ ︎venom (@venom1s) March 19, 2025
మేరఠ్ లో ఉండే మర్చంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్ పుత్, ముస్కాన్ రస్తోగీకి 2016 లో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. అయితే.. భర్త దూరంగా ఉంటుండంతో భార్యకు ఇష్టంలేకపొవడంతో.. ఆ ఉద్యోగం మానేశాడు. మరోజాబ్ చూసుకున్నాడు. వీరికి 2019 లో కూతురు పుట్టింది. అయితే.. ముస్కాన్ కు తనతో చదువుకునే ఫ్రెండ్ సాహిల్ శుక్లాతో వాట్సాప్ లో పరిచయం ఏర్పడింది. అది కాస్త ఇధ్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ క్రమంలో వీరి యవ్వారం భర్త సైరభ్ కుతెలియడంతో భార్యను పలు మార్లు హెచ్చరించారు.
ఆతర్వాత నేవీలోనే మర్చంట్ గా మళ్లీ ఉద్యోగంలో చేరాడు. భార్య ఇంటి వద్ద కూతుర్ని చూసుకుంటు ఉండేది. అయితే.. ఇటీవల తన కూతురు పుట్టిన రోజు కావడంతో సౌరభ్ యూఎస్ నుంచి వచ్చాడు.ఇది మాస్కాన్ రస్తోగీని నచ్చలేదు. దీంతో అతనుతినే అన్నంలో కొన్నిస్లిపింగ్ మాత్రలు కలిపారు. అతను తిన్నాక.. ప్రియుడ్ని పిలిచి.. రాయితో మోదీ హత్య చేశారు. ఇతని శరీరంను 15 ముక్కలుగా నరికి అక్కడే ఉన్న డ్రమ్ లో వేసి.. పై నుంచి సిమెంట్ వేశారు.
డ్రమ్ మూతను క్లోజ్ చేశాడు. ఇదంతా ఆరేళ్ల పాప గమనించింది. ఆ తర్వాత హిమచల్ ప్రదేశ్ , హిల్ స్టేషన్ కు ప్రియుడితో పారిపోయింది. తమ కొడుకు ఫోన్ తీయక పోవడంతో.. అనుమానంతో తల్లిదండ్రులు వెంటనే ఇంటికి చేరుకుని చూశాడు. అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డ్రమ్ నుంచి దుర్వాసన వస్తుండటంతో పోలీసులు పగలగొట్టి విచారణ చేపట్టారు. ఆ తర్వాత పోలీసులు ముస్కాన్ రస్తోగీ, సాహిల్ లను అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్ లో విచారణ చేపట్టగా నేరం అంగీకరించారు. ఆరేళ్ల పాప.. తన తండ్రి డ్రమ్ లో ఉన్నాడని చెప్పడం అందరిని కలిచి వేసింది. ఈ ఘటన తర్వాత సదరు యువతి తల్లిదండ్రులు సైతం.. తమ కూతురికి ఉరిశిక్షను విధించాలని డిమాండ్ చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe