)
Pm modi and deputy cm pawan kalyan reacts on tvk stampede: తమిళనాడులోని కరూర్ లో నటుడు విజయ్ కు చెందిన టీవీకే పార్టీ మీటింగ్ లో అత్యంత విషాకర సంఘటన చోటు చేసుకుంది. విజయ్ ను చూసేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు దీంతో తొక్కిసలాట సంభవించింది. ఈ ఘటనలో చాలా మంది కింద పడిపోయి ఊపిరాడక పోవడంతో చనిపోయారు. ప్రాథమిక సమాచారం మేరకు.. ఘటనలో 40 మంది వరకు చనిపోయారు.
అదే విధంగా మరో 50 మంది అభిమానులు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరి హెల్త్ సీరియస్ గా ఉంది. ఈ ఘటనపై సీఎం స్టాలీన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. యుద్ద ప్రాతిపదికన సహాయక చర్యల్ని చేపట్టాలని అధికారుల్ని ఆదేశించారు. ఈ ఘటనపై దేశప్రధాని మోదీ,రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.
మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియడంతో పాటు, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని కోరుతూ ట్విట్లు చేశారు. ముఖ్యంగా మృతుల్లో ఆరుగురు చిన్నారులు ఉండటం తీవ్ర ఆవేదన కలిగించిందని పవన్ కళ్యాన్ ట్విట్ చేశారు. మరోవైపు కేంద్ర హోంశాఖ మంత్రి తమిళనాడు సీఎం స్టాలీన్ తో ఫోన్ లో మాట్లాడారు.
తమిళనాడుప్రభుత్వం మృతి చెందిన వారి కుటుంబాలకు పది లక్షల చొప్పున పరిహరంగా అందిస్తామని ప్రకటించింది. అంతే కాకుండా గాయపడ్డవారికి వారికి ₹1 లక్ష చొప్పున ఇస్తామని తెలిపింది. ఘటనపై... రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి అరుణ జగదీశన్ నేతృత్వంలో ఏకసభ్య విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది. కమిటీ నివేదిక తర్వాత చర్యలు తీసుకుంటామని సీఎం స్టాలీన్ పేర్కొన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి