PM Modi Meets Injured Victims: ఢిల్లీ పేలుడు ఘటనలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ప్రధాని మోదీ పరామర్శించారు. భూటాన్ పర్యటన ముగించుకుని ఢిల్లీ చేరుకున్న ప్రధాని మోదీ.. ఎయిర్ పోర్టు నుంచి నేరుగా లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఆసుపత్రికి వెళ్లారు. పేలుడు ఘటనలో తీవ్రగాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఆయన పరామర్శించారు. బాధితులతో స్వయంగా మాట్లాడారు.
డాక్టర్లను అడిగి వారి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. అలాగే వారికి అందుతున్న వైద్యం గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని ప్రధాని చెప్పారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. కాగా, ఢిల్లీ పేలుడు ఘటనపై ప్రధాని తీవ్రంగా స్పందించారు. కుట్రదారులను వదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
బరువెక్కిన హృదయంతో ఇక్కడికి వచ్చా. ఈ దుఃఖ సమయంలో దేశం మొత్తం బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తోంది. పేలుడు ఘటనపై కేంద్ర భద్రతా సంస్థలు క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగాయి. ఈ దాడికి కారణమైన వారిని వదిలేది లేదు. వారిని తప్పకుండా న్యాయస్థానం ముందు నిలబెడతాం” అని ప్రధాని మోదీ అన్నారు.
Went to LNJP Hospital and met those injured during the blast in Delhi. Praying for everyone’s quick recovery.
Those behind the conspiracy will be brought to justice! pic.twitter.com/HfgKs8yeVp
— Narendra Modi (@narendramodi) November 12, 2025
Also Read: Fastest Trains: ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన 10 రైళ్లు ఇవే.. టాప్లో ఏ దేశం ట్రైన్ ఉందంటే..?
Also Read: IPL 2026: ఆ ఆటగాళ్లకి కావ్య పాప గుడ్బై.. లిస్ట్లో బడా ప్లేయర్స్.. ఎవరు ఉన్నారంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి








