Khushbu: ఒక్క మార్కు తక్కువగా వచ్చిందన్న కారణంతో తల్లిదండ్రుల ఒత్తిడి మేరకు ఇష్టమైన సైన్స్ కోర్సును వదిలేసి ఆర్ట్స్ లో చేరింది ఓ విద్యార్థిని. తన సోదరుల చదువు విషయంలో మాత్రం తల్లిదండ్రులు ఇలాంటి ఆంక్షలేమీ పెట్టలేదంటూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కన్నీటిపర్యంతమైంది. ఈ విషయం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ వద్దకు చేరింది. దీంతో ఆయన స్పందించారు. 11వ తరగతి చదువుతున్న ఆ బాలికకు ఫోన్ చేశారు. సైన్స్ కోర్సులో చేర్పిస్తానంటూ ఆ బాలికకు భరోసా కల్పించారు. బీహార్ లోని దానాపూర్ కు చెందిన ఖుష్బూ అనే విద్యార్థిని కథ ఇది.
ఇంటర్య్వూలో ఖుష్బూ వెల్లడించిన వివరాల ప్రకారం..10వ తరగతి పరీక్షల్లో 500కు 400 మార్కులు తెచ్చుకోవాలని ఆమె పేరెంట్స్ చెప్పారు. అయితే 399 ఖుష్బుకు వచ్చాయి. దీంతో తనను సైన్స్ కోర్సు తీసుకోనీయకుండా ఆర్ట్స్ లో చేర్పించారంటూ ఖుష్బూ వాపోయింది. ఇంట్లో తన పట్ల ఎంతో పక్షపాతం చూపుతున్నారంటూ ఆరోపించింది. తన సోదురులు సైన్స్ చదివే అవకాశం లభించిందని..తాను మాత్రం కేవలం ఒక్క మార్కుతో ఇష్టమైన కోర్సుకు దూరమైనట్లు ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఇంటర్వ్యూ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.
ఈ క్రమంలోనే ఖుష్బూకు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. సైన్స్ విభాగంలో అడ్మిషన్ గురించి దానాపూర్ జిల్లా కలెక్టర్ తో మాట్లాడినట్లు ఆమెకు తెలిపారు. నచ్చిన సబ్జెక్టు చదువుకునేందుకు ప్రధాని మోదీ, సీఎం నితీశ్ కుమార్ ప్రభుత్వాలు మీకు అండగా ఉన్నాయి. ఈ విషయమైన నును ఇప్పటికే జిల్లా కలెక్టర్ తో మాట్లాడాను. నీట్ కు కూడా ప్రిపేర్ అవ్వండి. డాక్టర్ కావాలనే మీ కలను నెరవేర్చుకోండని కేంద్రమంత్రి ప్రధాన్ ఖుష్బూ కు హామీ ఇవ్వడం విశేషం.
Also Read: Gold vs Stock Market: బంగారం వర్సెస్ స్టాక్ మార్కెట్..భవిష్యత్ లో ఎందులో మంచి రాబడి ఇస్తుంది?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









