Narendra Modi: జమ్ము కశ్మీర్ లోని మినీ స్విట్జర్లాండ్ గా పేరొందిన అనంత్నాగ్ జిల్లా పహల్గాం సమీప బైసరన్ లోయలో జరిగిన ఉగ్రదాడిలో 28 మంది కన్నుమూసారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ పై దౌత్యపరంగా అన్ని రకాల దారులను మూసేసింది. ముఖ్యంగా పాకిస్థాన్ ఆర్ధిక వ్యవస్థకు కీలకమైన సింధు నది జలాల ఒప్పందానికి బ్రేకులు వేసింది. ఇకపై పాకిస్థాన్ తో మాటలు లేవు. మాట్లాడుకోవడాలు లేవు అల్టీమేటం జారీ చేసింది.
తాజాగా ఉగ్రదాడి తర్వాత ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ తొలిసారి నోరు విప్పారు. అంతేకాదు అమాయక ప్రజలను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులను విడిచిపెట్టే ప్రసక్తి లేదన్నారు. ఈ దాడులకు పాల్పడ్డ వారిని ప్రపంచంలో ఏ మూలన ఉన్న వారిని పట్టుకొచ్చి తగిన విధంగా శిక్షిస్తామన్నారు. వారిని మట్టిలో కలిపే వరకు విడిచిపెట్టే ప్రసక్తే లేదంటూ బిహార్ సభలో ప్రసంగించారు.
అంతేకాదు యూరీ, బాలాకోట్ తరహాలో పాకిస్థాన్ పై మరో సర్జికల్ స్ట్రైక్ చేసే అవకాశాలున్నాయి. ముఖ్యంగా పాకిస్థాన్ తో వాణిజ్యపరంగా అన్ని సంబంధాలను ఇప్పటికే భారత్ తెగతెంపులు చేసుకుంది. ఇక పంజాబ్ లోని భారత్, పాకిస్థాన్ అట్టారీ - వాఘా సరిహద్దు చెక పోస్ట్ ను నిలిపి వేస్తున్నట్టు ప్రకటించింది. అంతేకాదు భారత్ వీసా పొందిన పాకిస్థాన్ టూరిస్టులు మరో 48 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని హుకుం జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇండస్, వాటర్ ట్రీటీతో పాటు పలు అంశాలపై పాకిస్థాన్ ను దిగ్బందనం చేసే పనిలో భారత్ నిమగ్నమైంది. అందులో భాగంగా పాకిస్థాన్ ప్రభుత్వ అధికారిక ఎక్స్ (ట్విటర్) ఖాతాను భారత్ బ్యాన్ చేసింది.
ఇదీ చదవండి: బడా స్టార్స్ సహా 900 సినిమాల్లో నటించిన నటి.. భర్త చనిపోవడంతో తాగుడుకు బానిసై జీవితం నాశనం..
ఇదీ చదవండి: ఈ చెట్లు ఉంటే.. పాములకు మీ ఇంట్లోకి రెడ్ కార్పెట్ పరిచినట్టే.. తస్మాత్ జాగ్రత్త..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.