
Rahul Gandhi:కాంగ్రెస్ అంటే ఒకప్పుడు.. అగ్రవర్ణాల పార్టీ అనేవారు. ఆ పార్టీలో మెజారిటీ నేతలు బడా సామాజిక వర్గాలకు చెందిన నేతలే ఉండేవారు. ఇప్పటికీ ఉన్నారు. ఇప్పటికే కొన్ని కీ పోస్టుల్లో వాళ్లే ఉన్నారు. కానీ కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా రాహుల్ గాంధీ తన మార్క్ను చూపిస్తున్నారు. తాను పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశాక.. కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు అగ్రవర్గం నేతకే అప్పగిస్తారని ప్రచారం జరిగింది. కానీ ఈ వాదనకు తెరదించుతు.. ఓ దళిత నేతకు ఏఐసీసీ పగ్గాలు అప్పగించారు రాహుల్ గాంధీ. అయితే పేరు మాత్రమే మల్లిఖార్జున ఖర్గే పార్టీ ప్రెసిడెంట్ పోస్ట్ ఇచ్చారే కానీ.. పగ్గాలు తన చేతిలోనే పెట్టుకున్నారనే టాక్ ప్రతిపక్షాల నుంచి వినిపిస్తోంది. ఇకమీదట కాంగ్రెస్ పార్టీ బహుజనుల పార్టీ అని నిరూపించే ప్రయత్నాల్లో ఉన్నారు. .తాజాగా తెలంగాణ కేబినెట్ విస్తరణ విషయంలోనూ రాహుల్ గాంధీ మార్క్ స్పష్టంగా కనిపించిందనే టాక్ వినిపించింది. తాజా మంత్రివర్గంలో బీసీ, ఎస్సీలకే చోటు కల్పించి.. సామాజిక న్యాయాన్ని పాటిస్తున్నామనే మెసేజ్ను పంపించారు.
ఇక ఏడాదిన్నరకు ముందు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్నారు. ఆయన రెడ్డి సామాజికవర్గం కావడంతో.. డిప్యూటీ సీఎంగా దళిత నేత భట్టి విక్రమార్కకు అవకాశం కల్పించారు. ప్రస్తుతం రాష్ట్ర కేబినెట్లో దళిత నేతల సంఖ్య నాలుగుకు చేరుకుంది. అటు బీసీలకు రాజ్యాధికారం ఇచ్చేందుకు రాహుల్ గాంధీ ఆసక్తిగా ఉన్నారు. ఇప్పటికే రాష్ట్ర కేబినెట్లో ముగ్గురు బీసీ లీడర్లకు మంత్రులుగా చాన్స్ ఇచ్చారు. ఇలా మంత్రి వర్గంలో దాదాపు బీసీ, ఎస్సీల అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామనే సంకేతాలను రాహుల్ పంపించారు.
అంతేకాదు.. ఇటీవల టీపీసీసీ ప్రెసిడెంట్గా బీసీ నేత మహేష్ కుమార్ గౌడ్కు అవకాశం ఇచ్చారు. టీపీసీసీ చీఫ్ పోస్టు కోసం చాలామంది ఓసీ, ఇతర సామాజికవర్గం నేతలు పోటీ పడ్డారు. చివరి నిమిషం వరకు ప్రయత్నాలు చేశారు. కానీ రాహుల్ గాంధీ మాత్రం.. బీసీ నేతకే టీపీసీసీ పగ్గాలు అప్పగించాలని డిసైడ్ కావడంతో.. మహేష్ కుమార్ గౌడ్కు అధ్యక్ష బాధ్యతలు దక్కాయి.. తాజాగా టీపీసీసీ కార్యకర్గాన్ని ప్రకటించారు. ఇందులోనూ బీసీ, ఎస్సీలకు అత్యధిక ప్రాధాన్యత కల్పించారు. తాజాగా టీపీసీసీ పదవుల్లో ఉపాధ్యక్షులుగా ఎనిమిది మంది బీసీ నేతలకు అవకాశం దక్కింది. అటు ఎస్సీ నేతలు ఐదుగురికి చోటు కల్పించారు. ఎస్టీలకు రెండు.. ముస్లిం మైనారిటీ నేతలకు మూడు పోస్టులు దక్కాయి.. మొత్తం 27 మంది ఉపాధ్యక్ష పదవుల్లో 18 మంది బహుజన బిడ్డలే ఉండటం విశేషం..
మరోవైపు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవుల్లో బీసీలకు ఎక్కువ న్యాయం జరిగింది. గతంలో ఎన్నడూ లేని రీతిలో 26 మంది బీసీ లీడర్లకు ప్రధాన కార్యదర్శి పోస్టులు దక్కాయి. అటు ఎస్సీ నేతలకు 9 పోస్టులు, ఎస్టీ లీడర్లకు 4 పోస్టులు దక్కాయి. ముస్లిలకు 8 పదవులు దక్కాయి.. మొత్తం 69 మందికి పదవులిస్తే అందులో 47 మంది బహుజన బిడ్డలే ఉన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఒక్క సామాజికవర్గానికి పోస్టులు దక్కుతాయనే ప్రచారాన్ని తిప్పికొడుతూ సామాజిక న్యాయాన్ని చేతల్లో చూపించందనే టాక్ కాంగ్రెస్ పార్టీ నుంచే వినబడింది. మొత్తానికి అధికార పార్టీలో బహుజన బిడ్డలకు ఎక్కువ పదవులు దక్కుతుండటంతో.. కింది స్థాయిలో కేడర్ కూడా ఫుల్ ఖుషీ అవుతోంది..
ఏదీఏమైనా తెలంగాణలో మరోసారి అధికారమే టార్గెట్గా కాంగ్రెస్లో కొలువుల జాతర జరుగుతున్నట్టు తెలుస్తోంది. గతంలో ఏ ప్రభుత్వం చేయనట్టు కులగణన చేసిన రేవంత్ సర్కార్.. లెక్కలతో సహా వివరించింది. రాష్ట్రంలో బీసీ, ఎస్సీలకే తమ ప్రాధాన్యత అని సీఎం కూడా పదేపదే చెబుతున్నారు. ఇందులో భాగంగానే.. ఇప్పుడు ప్రభుత్వ పదవులు, పార్టీ పదవుల్లోనూ అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. రానున్న రోజుల్లోనే ఇదే సామాజిక న్యాయాన్ని పాటిస్తూ.. ముందుకే సాగేలా కాంగ్రెస్ పెద్దలు ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే కొన్ని కీలక పదవులైన ముఖ్యమంత్రి పదవులను రెడ్డిలకే అప్పగించింది. మొత్తంగా చోటా, మోటా పదవులు ఇతర కులాలకు ఇచ్చి కేవలం వాళ్లను బుజ్జిగించే ప్రయత్నం చేస్తుందనే టాక్ వినిపిస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.