)
Bharti dixit lady officer files case on Husband ias ashish modi: ఇటీవల భార్య భర్తలకు చెందిన గొడవలు, వివాదాలు తరచుగా వార్తలలో ఉంటున్నాయి. కొంత మంది ప్రతిచిన్నవిషయాలకు కూడా గొడవలు పెట్టుకుని డైవర్స్ వరకు వెళ్లిపోతున్నారు. మరికొన్ని చోట్ల భార్యభర్తలు.. కట్టుకున్న వాళ్లను హత్యలు చేయడం వంటివి చేస్తున్నారు. ఇలాంటి గొడవలు కామన్ గా మారిపోయాయి. అయితే.. ఉన్నత చదువులు చదువుకుని సమాజంలో గొప్పస్థానంలో ఉండి కూడా కొంత మంది భార్యభర్తలు గొడవలు పడటం చూస్తుంటే ఒకింత ఆశ్చర్యంకు గురిచేస్తుంది.
అచ్చం ఈ కోవకు చెందిన ఘటన రాజస్థాన్ లో చోటు చేసుకుంది. ఇక్కడ ఏకంగా ఇద్దరు ఐఏఎస్ భార్యభర్తలు గొడవలు పడి పోలీసులకు ఫిర్యాదులు చేసుకొవడం వరకు వెళ్లారు.ఈ ఘటన ప్రస్తుతం దేశంలో చర్చనీయాంశంగా మారింది.
రాజస్థాన్ కు చెందిన ఇద్దరు ఐఏఎస్ భార్యభర్తలు గొడవలు పడి పోలీసుల వరకు వెళ్లారు. తన భర్త నుంచి తనకు ప్రాణ హనీ ఉందని ఐఏఎస్ భార్య పోలీసులకు ఫిర్యాదుచేసింది. 2014 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ భారతి దీక్షిత్, ఆశిష్ మోడీలు భార్యభర్తలు. ఐఏఎస్ భారతి దీక్షిత్ ఆర్థిక శాఖలో జాయింట్ సెక్రటరీగా పనిచేస్తుండగా.. ఆమె భర్త ఆశిష్ సామాజిక న్యాయం సాధికారత డైరెక్టర్గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో ఐఏఎస్ భారతి దీక్షిత్, ఆశిష్ మోడీల పెళ్లి పెద్దల అంగీకారంతో 2014లో జరిగింది.
పెళ్లి జరిగిన తర్వాత కొన్నిరోజులు పాటు బాగా ఉన్న తనభర్త ఆ తర్వాత తరచుగా వేధించేవాడని, తాగి వచ్చేవాడని ఐఏఎస్ భారతి దీక్షిత్ జైపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నవంబర్ 7న SMS పోలీస్ స్టేషన్ (జైపూర్)లో దాఖలు చేసిన ఎఫ్ఐఆర్లో, దీక్షిత్ తన భర్తపై శారీరకంగా దాడి చేయడంతో పాటు, తుపాకీ గురిపెట్టి బెదిరించాడని, అక్రమ నిర్బంధం, బెదిరింపులకు పాల్పడినట్లు ఐఏఎస్ భారతి దీక్షిత్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అదే విధంగా.. అక్టోబర్ 14, 15 తేదీల్లో ఆశిష్ మోడీ తనతో పాటు కుమార్తెను అపహరించి, ఒక గంటకు పైగా ఇంట్లో బందీలుగా ఉంచాడని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. మోడీ తనకు పిస్టల్ చూపించాడని, డైవర్స్ ఇవ్వకుంటే.. చంపేస్తాని బ్లాక్ మెయిల్ చేసినట్లు కూడా ఐఏఎస్ భారతి దీక్షిత్ తన భర్త ఆశిష్ మోడీపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
2014 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి అయిన 38 ఏళ్ల దీక్షిత్ తన ఫిర్యాదులో, తన తండ్రి క్యాన్సర్తో బాధపడుతున్నప్పుడు, తన భర్త తనను ఐఏఎస్ ఎంపిక సమయంలో మోసగించాడని పేర్కొంది. ఆశిష్ మోడీ తన క్యాడర్ గురించి తప్పుడు వివరాలను చెప్పి తనను బలవంతంగా వివాహం చేసుకున్నాడని ఆమె ఆరోపించింది.
ఆ సమయంలో మోడీకి నాగాలాండ్ కేడర్ కేటాయించబడిందని చెప్పింది. కానీ అతను రాజస్థాన్ కేడర్ అధికారిగా కనిపించడానికి తనను స్థానికతపై తప్పుగా చూపించుకున్నాడని ఆరోపణలు చేసింది. నా మానసిక స్థితిని ఆసరాగా చేసుకుని నన్ను బలవంతంగా వివాహం చేసుకున్నాడని, తనకు చెప్పినవన్నీ అబద్ధమని తర్వాత తెలిసిందని ఆమె తన ఎఫ్ఐఆర్లో పేర్కొంది.
2018లో, ఆ జంటకు ఐవీఎఫ్ ద్వారా ఒక కుమార్తె పుట్టిందని, ఆ తర్వాత, తన భర్త ప్రవర్తన మరింత దూకుడుగా మారిందని ఆమె ఆరోపించారు.
గొంతు కోసి చంపేందుకు ప్రయత్నించాడని, పదే పదే దాడులు చేశాడని, దుర్భాషలాడాడని, భద్రత కోసం ఢిల్లీలోని తన తల్లిదండ్రులతో నెలల తరబడి ఉండాల్సి వచ్చిందని ఆమె ఆరోపించింది. ప్రభుత్వ ఇంట్లో కూడా తనకు ప్రాణహాని ఉందని నేను భయపడ్డానని ఆమె పోలీసులకు తెలిపింది. వివాహేతర సంబంధాలు, ప్రజా కుంభకోణాలు తన భర్త చాలా చేశాడని పొలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన ప్రస్తుతం రాజస్థాన్ లో సంచలనంగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook