Ram Mandir Pran Pratishtha 2025: రాముడి జన్మస్థలమైన అయోధ్య నగరం మరోసారి భక్తి, ఆధ్యాత్మిక ఉత్సాహంతో కళకళలాడుతోంది. 2025 జూన్ 3 నుండి 5 వరకు శ్రీరామ జన్మభూమి ఆలయంలో రామ దర్బార్, ఇతర 14 దేవాలయాల విగ్రహాల ప్రాణ ప్రతిష్ఠ ఉత్సవం జరగనుంది. ఈ కార్యక్రమం గంగా నది అవరోహణకు ప్రతీక అయిన గంగా దసరా శుభ సందర్భంగా జరుగుతోంది.
ఈ వేడుకలు జూన్ 2, 2025న మంగళ్ కలష్ యాత్రతో ప్రారంభమయ్యాయి. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపిన వివరాల ప్రకారం జూన్ 5న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఆరోజు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పుట్టినరోజు కూడా.
ఈ మహా ఘట్టం ప్రారంభం అయిన 2025 జూన్ 2న అయోధ్యలో మంగళ కలశ యాత్ర జరిగింది. ఈ యాత్ర సాయంత్రం 4 గంటలకు సరయు నది ఒడ్డున ఉన్న సంత్ తులసీదాస్ ఘాట్ నుండి ప్రారంభమైంది. సరయు పవిత్ర జలంతో నిండిన కలశాలు మోసుకెళ్లి దాదాపు 400 మంది మహిళలు ఈ యాత్రలో పాల్గొన్నారు. ఈ యాత్ర లతా చౌక్, రాంపాత్, హనుమాన్గరి, బడా స్థాన్, రంగమహల్ మీదుగా రామమందిరంలోని యాగ మండపానికి చేరుకుంది.
జూన్ 3వ తేదీ ఉదయం 6:30 గంటలకు ఈ పూజలు ప్రారంభమై 12 గంటల పాటు కొనసాగుతాయి. ఈ రోజున పంచాంగ పూజ, యాగ మండప పూజ, గ్రహ యజ్ఞం, అగ్ని స్థాపన, హవన , విగ్రహాల జలధివాసాలు జరుగుతాయి. జూన్ 4వ తేదీన అన్నధివాసం, దేవ్ స్నానం, గ్రామ ప్రదక్షిణ, శయాధివాసం వంటి ఆచారాలు జరుగుతాయి. ప్రధాన వేడుక జూన్ 5వ తేదీన గంగా దసరా రోజున జరుగుతుంది. ఉదయం 11:25 నుండి 11:40 గంటల మధ్య అభిజీత్ ముహూర్తం సందర్భంగా రామ్ దర్బార్, ఇతర దేవాలయాల విగ్రహాలను ప్రతిష్టిస్తారు. మధ్యాహ్నం 1 గంటలకు ఆరతితో ఈ పూజ పూర్తవుతుంది. కాశీ పండితుడు పండిట్ జైప్రకాష్ నేతృత్వంలోని 101 మంది వేద ఆచార్యులు ఈ వేడుకను నిర్వహిస్తారు.
ఈ వేడుకలో రామమందిరం మొదటి అంతస్తులో రామ దర్బార్ ప్రాణ ప్రతిష్ట ఉంటుంది. ఇందులో రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు, భరతుడు, శత్రుఘ్నుల విగ్రహాలు ఉంటాయి. ఈ విగ్రహాలు జైపూర్ నుండి వచ్చిన తెల్ల పాలరాయితో అందంగా చెక్కారు. వీటి ఎత్తు దాదాపు 4.5 అడుగులు. ప్రత్యేకత ఏమిటంటే రాముడు, సీత విగ్రహాలు ఒకే రాయి నుండి చెక్కబడ్డాయి. ఇది వారి విడదీయరాని బంధాన్ని చూపిస్తుంది.
ఆలయ ప్రాంగణంలోని సరిహద్దు గోడలోని 6 ఆలయాలలో గణేశుడు, సూర్యుడు, మాతా జగదంబ, అన్నపూర్ణ, హనుమంతుడు, శివలింగ విగ్రహాలను ప్రతిష్టిస్తారు. సప్త మండపంలోని 7 ఆలయాలలో మహర్షి వాల్మీకి, వశిష్ఠ, విశ్వామిత్ర, అగస్త్య, నిషాదరాజ్, మాతా శబరి, దేవి అహల్య విగ్రహాలు ఉంటాయి. శేషావతార్ ఆలయంలో లక్ష్మణ్ జీ విగ్రహాన్ని కూడా ప్రతిష్టిస్తారు. మొత్తంగా, 14 ఆలయాలను ప్రతిష్టిస్తారు. ఆలయంలోని శిఖరాగ్ర కలశాలు బంగారంతో పూత పూశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook









