Road Accident: నేషనల్ హైవే‌పై ఘోర రోడ్డు ప్రమాదం..లోయలో పడిన లారీ..22 మంది దుర్మరణం, ఎక్కడంటే?

Road Accident In Arunachal Pradesh: ఓ ఘోర రోడ్డు ప్రమాదం ఉలిక్కిపడేలా చేసింది. అరుణాచల్ ప్రదేశ్‌లోని అంజా జిల్లాలో ఈ రోడ్డు ప్రమాదంలో 22 మంది కార్మికులు మరణించారు. కార్మికులను తీసుకెళ్తున్న ఒక ట్రక్కు నియంత్రణ కోల్పోయి కొండపై నుంచి లోతైన లోయలో పడిపోవడం వల్ల ఈ ఘోరం జరిగినట్లు తెలుస్తోంది.

Written by - Harish Darla | Last Updated : Dec 11, 2025, 05:41 PM IST
Road Accident: నేషనల్ హైవే‌పై ఘోర రోడ్డు ప్రమాదం..లోయలో పడిన లారీ..22 మంది దుర్మరణం, ఎక్కడంటే?

Road Accident In Arunachal Pradesh: ఓ ఘోర రోడ్డు ప్రమాదం ఉలిక్కిపడేలా చేసింది. అరుణాచల్ ప్రదేశ్‌లోని అంజా జిల్లాలో ఈ రోడ్డు ప్రమాదంలో భారీగా ప్రాణనష్టం జరిగింది. కార్మికులను తీసుకెళ్తున్న ఒక ట్రక్కు నియంత్రణ కోల్పోయి కొండపై నుంచి లోతైన లోయలో పడిపోవడం వల్ల ఈ ఘోరం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ట్రక్కులో ప్రయాణిస్తున్న 22 మంది కార్మికులు మరణించినట్లు స్థానిక పోలీసులు తెలిపారు.

Add Zee News as a Preferred Source

పోలీసుల కథనం ప్రకారం.. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం అంజా జిల్లాలోని చాగ్లగాం ప్రాంతం (హైలాంగ్-చాగ్లఘం రోడ్డులోని మెటెంగ్లియాంగ్ సమీపంలో) ఈ ప్రమాదం జరిగింది. మరణించిన 22 మంది కార్మికులలో 19 మంది అస్సాంలోని టిన్సుకియా జిల్లాలోని గిలాపుకురి టీ ఎస్టేట్‌కు చెందినవారుగా పోలీసులు గుర్తించారు. వీరంతా ఒక కాంట్రాక్టు పని కోసం అరుణాచల్ ప్రదేశ్‌లోని ప్రాజెక్ట్ సైట్‌కు వెళుతున్నట్లు స్పష్టం చేశారు.

Also Read: Pini Village Women: ఆ గ్రామంలో మహిళలు దుస్తులు ధరించరు..భారత్‌లోనే వింతైన గ్రామం..ఎక్కడుందో తెలుసా?

ప్రమాద కారణం ఏమిటంటే?
ప్రమాదం జరిగిన రోడ్డు ప్రయాణానికి అనువుగా లేదు. చాలా ప్రమాదకరమైన రీతిలో ఉంది. ఇరుకైన మలుపులు, నిటారుగా దిగులు, లోతైన లోయలు ఈ మార్గంలో తరచుగా ప్రమాదాలకు దారితీస్తుంటాయి. ఈ ప్రమాదం జరగడానికి గల కారణాలపై దర్యాప్తు జరుగుతోందని ఓ పోలీసు అధికారి స్పష్టం చేశారు. ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే పోలీసులు, సహాయక బృందాలు రంగంలోకి దిగాయి.

మృతదేహాల వెలికితీత.. 
ఇప్పటివరకు 19 మంది కార్మికుల మృతదేహాలను వెలికితీసినట్లు పోలీసులు స్పష్టం చేశారు. అయితే మరణించిన వారిలో 19 మంది వివరాలను తెలుసుకోగా.. మరో ముగ్గుర్ని ఇంకా గుర్తించాల్సి ఉందట. మిగిలిన మృతదేహాల కోసం గాలింపు కొనసాగుతోంది. వెలికితీసిన మృతదేహాలను పోస్ట్‌మార్టం పరీక్షల కోసం పంపినట్లు తెలుస్తోంది.

ఈ ప్రాంతం ఇండో-చైనా సరిహద్దు వెంబడి ఉండటం వల్ల.. ఇక్కడ రోడ్డు ప్రాజెక్టులలో పనిచేసే కార్మికులు తరచుగా వాతావరణ మార్పులు, కొండచరియలు విరిగిపడడం వంటి ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఈ విషాధ ఘటనపై అస్సాం, అరుణాచల్ ప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన సీనియర్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని.. సహాయక చర్యలు ముమ్మరంగా జరిగే విధంగా ప్లాన్ చేస్తున్నారు.

Also Read: TTD Dupatta Scam: తిరుమల శ్రీవారి గుడిలో మరో స్కామ్..రూ.54 కోట్లు శఠగోపం..గుడిలో ఇన్ని జరిగితే, రాష్ట్రంలో ఎన్ని జరిగాయో?!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

About the Author

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్ డిజిటల్ మీడియాలో జర్నలిస్ట్‌గా పనిచేస్తున్నారు.  గత 7 ఏళ్ల అనుభవంతో ఇక్కడ 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.

...Read More

Trending News