)
Special Coin Release: భారత ప్రభుత్వం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) 100వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రూ. 100 నాణెం తపాలా బిళ్లను విడుదల చేసింది. ఈ కార్యక్రమం ఢిల్లీలోని డాక్టర్ అంబేద్కర్ అంతర్జాతీయ కేంద్రంలో జరిగింది. ఈ నాణెం, తపాలా బిళ్లను భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా విడుదల చేశారు. ప్రధాని మోదీ ఈ నాణెం, బిళ్ల ప్రత్యేకతను వివరించారు.. ఇవి కేవలం లోహపు ముక్కలు మాత్రమే కాదు, దేశభక్తి, సేవా భావనలకు చిహ్నమని తెలిపారు.
భారతదేశంలో ప్రస్తుతం 50 పైసల నుండి 20 రూపాయల వరకు వివిధ డినామినేషన్లలో నాణేలు చెలామణిలో ఉన్నాయి. వీటిలో 1, 2, 5, 10 రూపాయల నాణేలు రోజువారీ లావాదేవీలలో విస్తృతంగా ఉపయోగపడుతున్నాయి. 20 రూపాయల నాణెం ఇటీవల పరిచయం చేసింది ప్రభుత్వం. మార్కెట్లో దాని ప్రాముఖ్యత పెరుగుతోంది. 50 పైసల నాణెం చాలా అరుదుగా కనిపిస్తుంది. అయినప్పటికీ చట్టపరంగా ఇంకా చెల్లుబాటు అవుతుంది. వీటితోపాటుగా 75, 90, 125, 150, 1000 రూపాయల నాణేలు కూడా భారతదేశంలో జారీ చేశారు. కానీ ఇవి సాధారణంగా రోజువారీ లావాదేవీలలో ఎక్కువగా ఉపయోగించరు.
ఈ రూ. 100 నాణెం ప్రత్యేకత ఏమిటంటే, స్వతంత్ర భారత చరిత్రలో తొలి సారి ‘భారత మాత’ చిత్రాన్ని నాణెంపై ముద్రించారు. ఒక వైపు భారతదేశ జాతీయ చిహ్నం ఉండగా, మరో వైపు భారత మాత చిత్రం ముద్రించి ఉంది. ఇది RSS స్వచ్ఛంద సేవకుల దేశభక్తి, సేవా అంకితభావాన్ని ప్రతిబింబిస్తుంది. ప్రధాన నాణెంతో పాటు విడుదలైన తపాలా బిళ్లకు కూడా ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ భవిష్యత్ పౌరులలో దేశభక్తి, సేవా భావం పెంపొందించాలని ప్రత్యేకంగా సూచించారు.
రాష్ట్రీయ స్థాయిలో జరిగిన ఈ కార్యక్రమం RSS 100వ వార్షికోత్సవ వేడుకలలో ముఖ్య ఘట్టంగా నిలిచింది. ప్రత్యేక నాణెం, తపాలా బిళ్లు స్మారకంగా, భారతీయ చరిత్ర, సంస్కృతి, దేశభక్తిని ప్రతిబింబించే విధంగా రూపొందించాయి. ఇవి సమకాలీన భారతీయ చరిత్రలో ఒక స్మరణీయ ఘట్టంగా గుర్తింపు పొందాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U ఆపిల్ లింక్ - https://apple.