బీజేపూర్ (ఒడిశా):  బుధవారం ఒడిశాలోని అధికార బిజూ జనతాదళ్ (బీజేడీ) బీజేపూర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉపఎన్నికలలో  విజయం సాధించింది.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బీజేడీ చెందిన రీతా సాహు తన సమీప ప్రత్యర్ధి భారతీయ జనతా పార్టీ (బీజీపీ) అభ్యర్థి అశోక్ పానిగ్రహిని 41,933 ఓట్ల తేడాతో ఓడించారు. కాంగ్రెస్ అభ్యర్థి ప్రణయా సాహుకి మూడవ స్థానం దక్కింది. విజయాన్ని ప్రకటించిన వెంటనే బీజీపీ శిబిరంలో పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చారు. ఒడిషా ముఖ్యమంత్రి, బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్ ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.


'బీజేడీకి విజయాన్ని అందించిన ప్రజలకు నా కృతజ్ఞతలు. ఇదే విజయం 2019 సార్వత్రిక ఎన్నికలలో కూడా ఇదే పునరావృతం అవుతుందని భావిస్తున్నాం' అని పట్నాయక్ చెప్పారు.


ఆగష్టు 2017లో కాంగ్రెస్ ఎంఎల్ఏ సుబల్ సాహు మరణం తరువాత బీజేపూర్ లో ఎన్నిక తప్పనిసరైంది. ఫిబ్రవరి 24న బీజేపూర్ లో ఉప ఎన్నిక నిర్వహించారు. 82 శాతం మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు.