)
Sabarimala Temple Opening Dates: శబరిమల అయ్యప్ప ఆలయం ఈ నెల 17వ తేదీ నుంచి 22 వ తేదీ వరకు తెరవనున్నట్లు ఆలయ బోర్డు వెల్లడించింది. ఇదే సమయంలో గర్భగుడి ముందున్న ద్వారపాలక విగ్రహాలకు బంగారు పూతపూసిన రాగి తాపడాలను ఆలయం తెరిచిన వెంటనే.. అంటే అక్టోబర్ 17న ఏర్పాటు చేస్తామని ట్రావెన్ కోర్ దేవస్వమ్ బోర్డు స్పష్టం చేసింది. కేరళ హైకోర్టు, ఆలయ ప్రధాన పూజారి నుంచి ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది.
శబరిమల అయ్యప్పను దర్శించుకోవాలనుకునే భక్తులు వర్చువల్ క్యూ విధానంలో దర్శన టికెట్లు పొందొచ్చని తెలిపారు. తులం మాస దర్శనం కోసం బుకింగ్లు అక్టోబర్ 6న సాయంత్రం 5 గంటలకు అధికారిక వెబ్ సైట్ sabarimalaonline.org ద్వారా ప్రారంభమయ్యాయి. ఐదేళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలకు ఆన్లైన్ బుకింగ్ నుంచి మినహాయింపును ఇచ్చారు.
ప్రస్తుతం వర్చువల్ క్యూ వ్యవస్థను నిర్వహిస్తున్న కేరళ పోలీసులు భక్తుల భద్రత గురించి చర్యలు తీసుకుంటున్నారు. రోజువారీ యాత్రికుల సంఖ్యను పరిమితం చేసే వర్చువల్ క్యూ వ్యవస్థను, అంచనా వేసిన రద్దీని నిర్వహించడానికి అమలు చేస్తున్నారు.
ఇక శబరిమల ఆలయంలోని విగ్రహాల బంగారం తాపడం బరువు తగ్గడంపై జరుగుతున్న వివాదంపై.. కేరళ దేవస్వమ్ మంత్రి కె. రాధాకృష్ణన్ స్పందించారు. శబరిమల వద్ద అన్ని కార్యకలాపాలు పూర్తి పారదర్శకతతో జరుగుతున్నాయని చెప్పారు. ఈ అంశంపై హైకోర్టు పూర్తి విచారణకు ఆదేశించిందని, నివేదికను అందిన తర్వాత నిందితులపై తదుపరి చర్యలు తీసుకుంటామని మంత్రి వెల్లడించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.