Scheme: రాష్ట్రప్రభుత్వం మహిళలకు శుభవార్త.. రూ.2500 కావాలంటే వెంటనే దరఖాస్తు చేసుకోండి..!

Women Scheme: మహిళలకు ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. మహిళా దినోత్సవం సందర్భంగా బంపర్ ఆఫర్ ప్రకటించింది. రాష్ట్రంలో కొత్త పథకం ప్రారంభించనుంది సర్కార్‌. ఈ నేపథ్యంలో మీరు కూడా రిజిస్ట్రేషన్ చేసుకుంటే రూ.2500 రూపాయలు ప్రతినెల పొందుతారు. ఈ పథకం పూర్తి వివరాలు తెలుసుకుందాం..

Written by - Renuka Godugu | Last Updated : Mar 5, 2025, 04:40 PM IST
Scheme: రాష్ట్రప్రభుత్వం మహిళలకు శుభవార్త.. రూ.2500 కావాలంటే వెంటనే దరఖాస్తు చేసుకోండి..!

Women Scheme: 'అంతర్జాతీయ మహిళా దినోత్సవం' సందర్భంగా ప్రభుత్వం తీపి కబురు అందించింది. మహిళల కోసమే ప్రత్యేకంగా ప్రారంభించనున్నారు ఈ పథకం. పథకానికి దరఖాస్తు చేసుకున్న మహిళలందరూ అర్హులవుతారు. ఇందులో కొన్ని నిబంధనలు ఉన్నాయి. వాటికి మీరు అర్హులు అయితే ఈ పథకం ద్వారా మీరు లబ్ది పొందుతారు. ప్రతినెలా మీ ఖాతాలో ప్రతినెలా రూ.2500 డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT)ద్వారా పొందుతారు. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు. ప్రతి ఏడాది వైభవంగా జరుపుకొంటారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ వేడుకలు నిర్వహిస్తోంది..

Add Zee News as a Preferred Source

మహిళా సమృద్ధి యోజన పథకాన్ని బిజెపి ప్రభుత్వం ప్రారంభించనుంది. ఈ పథకం ద్వారా మహిళలకు ఆర్థిక సాయం అందుతుంది. ముఖ్యంగా ఢిల్లీలోని మహిళలకు ఈ పథకం వర్తించనుంది. ఈ నేపథ్యంలో ఎంపీ మనోజ్ తివారి మీడియాతో చెప్పారు. కేవలం రిజిస్ట్రేషన్ చేసుకున్న మహిళలు మాత్రమే ఈ పథకానికి అర్హులు అవుతారు. వారి ఖాతాల్లో ప్రతి నెల రూ.2500 జమ అవుతాయి. ఈ పథకాన్ని అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు ప్రారంభించనున్నారు అని చెప్పారు.

ఈ పథకానికి మీరు కూడా దరఖాస్తు చేసుకోవాలంటే దీనికి కావాల్సిన ధ్రువపత్రాలు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.. ఢిల్లీ సీఎం రేఖ గుప్తా ఇటీవల ప్రమాణ స్వీకారం చేశారు.ఈ  నేపథ్యంలో ఆమె ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత రేఖ ఈ పథకాన్ని ప్రారంభించనుంది. ఇందులో బెనిఫిట్స్ మీరు కూడా పొందాలంటే కావాల్సిన పత్రాలు ఏంటో తెలుసుకుందాం.

ఆధార్ కార్డు, ఢిల్లీ రెసిడెన్స్ సర్టిఫికెట్, బ్యాంకు ఖాతా వివరాలు, ఆదాయపు ధృవీకరణ పత్రం, ఆధార కార్డుతో లింక్ అయినా మొబైల్ నెంబర్.అయితే ఈ పథకానికి కేవలం మహిళలు మాత్రమే అర్హులు. వారి ఏడాది ఆదాయం మూడు లక్షల లోపు మాత్రమే ఉండాలి. మూడు లక్షలకు మించి ఉంటే ఈ పథకానికి అర్హులు కారు. అంతేకాదు వీరు ఢిల్లీ శాశ్వత నివాసి అయి ఉండాలి ఇతర ప్రాంతాలకు చెందిన మహిళలు ఈ పథకానికి అర్హులు కాదు.

ఇదీ చదవండి:  షాంపూ, నూనెలు కాదు.. ఇలా మసాజ్‌ చేసినా జుట్టు మోకాళ్ల వరకు పెరగడాన్ని ఎవ్వరూ ఆపలేరు..

మహిళా సమృద్ధి యోజన రిజిస్ట్రేషన్ కేవలం ఆన్లైన్ లో మాత్రమే చేసుకోవాలి. మార్చి 8వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది. ముఖ్యంగా 'ఇ- డిస్టిక్' పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దీనికి మీరు కావాల్సిన ధృవపత్రాలను కూడా అక్కడ అప్లోడ్‌ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత అప్లికేషన్ ఫిల్ చేసి, చివరగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు చేసే మహిళలు ఈ పథకానికి అర్హులు కాదు. ఇన్‌కమ్ టాక్స్ ఫైల్ చేసే మహిళలు కూడా ఈ పథకానికి అర్హులు కాదు. ఇప్పటికే ఈ పథకం ద్వారా లబ్ది పొందుతున్న మహిళలు కూడా ఈ సమృద్ధి యోజన పథకానికి అప్లై చేసుకోకూడదు.

ఇదీ చదవండి: పాపం.. బైకర్‌ను కాపాడబోయిన బస్సుకు చివరికి ఏం జరిగిందో చూడండి.. లైవ్‌ సీసీ ఫూటేజీ వీడియో..!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

About the Author

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News