)
School Holidays In Telangana: గత అక్టోబర్ నెల అనేక పండగలతోని సెలవులతో నిండి ఉండగా.. నవంబర్ నెల కూడా మొదటి వారంలోని సెలవులతో ప్రారంభమైంది. ఈ నెలలో కూడా భారతదేశ వ్యాప్తంగా ఉన్న వివిధ మతపరమైన కార్యక్రమాలు కారణంగా ఎన్నో సెలవులు వస్తున్నాయి. ఇవి స్కూల్ విద్యార్థులకు ప్రత్యేకంగా బోతున్నాయి. ముఖ్యంగా నవంబర్ 5వ తేదీనే గురునానక్ జయంతి రావడం వల్ల ఈరోజు దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో పాఠశాలలో బంద్ ఉంటాయి. అలాగే గురు తేజ్ బహదూర్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా కూడా నవంబర్ 25వ తేదీన పాఠశాలల విద్యార్థులకు సెలవు లభించబోతోంది. ఇప్పటికే గురువారం గురునానక్ జయంతి సందర్భంగా కొన్ని రాష్ట్రాలు అధికారికంగా సెలవులు ప్రకటించాయి.
రేపే గురుపౌర్ణిమ..
గురు పౌర్ణమితో పాటు గురునానక్ జయంతి సందర్భంగా తెలంగాణలోని పబ్లిక్ హాలిడే ఉంది. దీని కారణంగా అన్ని ప్రభుత్వ ప్రైవేటు విద్యాసంస్థలకు.. అలాగే ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు లభించబోతోంది. దీంతో గురువారం నవంబర్ 5వ తేదీ అన్ని పాఠశాలలకు సెలవు లభిస్తుంది. అలాగే తిరిగి మళ్లీ నవంబర్ ఆరవ తేదీన పాఠశాలలు తిరిగి తెరుచుకుంటాయి. ఇక ఆంధ్రప్రదేశ్ అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం రేపు ఆప్షనల్ హాలిడే మాత్రమే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హాలిడే ప్రకటిస్తే.. గురునానక్ జయంతి సందర్భంగా హాలిడే ఉంటుంది.
నవంబర్ మూడో తేదీ నుంచి ఆరవ తేదీ వరకు వరసగా హాలిడే..
ఉత్తరప్రదేశ్లోని బులంద్షహర్ జిల్లాలోని విద్యార్థులకు బంపర్ గుడ్ న్యూస్. ఈ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు నవంబర్ మూడో తేదీ నుంచి ఆరవ తేదీ వరకు వరసగా నాలుగు రోజులపాటు సెలవులు ప్రకటించినట్లు జిల్లా ప్రాథమిక విద్య శాఖకు సంబంధించిన అధికారి తెలిపారు. ఈ జిల్లాలో ప్రత్యేకంగా గంగా స్నాన్ మేళా తో పాటు గురు పౌర్ణమి, గురునానక్ జయంతిని దృష్టిలో పెట్టుకొని ఈ సెలవులు ప్రకటించినట్లు అధికారులు తెలిపారు. దీంతో మళ్లీ పాఠశాలలో నవంబర్ ఏడవ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. అప్పటిదాకా విద్యార్థులకు వరసగా నాలుగు రోజులపాటు హాలిడే లభించబోతోంది. అలాగే ఉపాధ్యాయులకు కూడా ఈ నాలుగు రోజుల సెలవు వర్తిస్తుందని అధికారులు అధికారికంగా వెల్లడించారు.
గురునానక్ జయంతి సందర్భంగా బులంద్షహర్ జిల్లాలో గంగా స్నానానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. ముఖ్యంగా కొన్ని ఘాట్లలో ఊహించని స్థాయిలో భక్తులు నది స్నానాలను ఆచరిస్తారు. దీనివల్ల నగరంలో ట్రాఫిక్ జామ్ అవ్వడమే కాకుండా.. కొన్ని ప్రదేశాల్లో రద్దీ నెలకొంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని విద్యాశాఖ అధికారులు ప్రత్యేకమైన సెలవులను ప్రకటించినట్లు తెలిపారు. దీనికోసమే నవంబర్ 3 నుంచి 4వ తేదీల మధ్య సెలవులు ప్రకటించారు. ఇక గురునానక్ జయంతి సందర్భంగా నవంబర్ ఐదు న రాష్ట్రవ్యాప్తంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. దీంతో ఈరోజు ప్రభుత్వ బ్యాంకులకు, ప్రభుత్వ కార్యాలయాలలో పనులు చేసే ఉద్యోగులకు కూడా సెలవు లభించబోతోంది. ఇక ఈ జిల్లాలో భక్తుల రద్దీ కొనసాగితే.. నవంబర్ ఆరవ తేదీ కూడా సెలవు ఉండే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో రెండు రోజుల పాటు వరుసగా సెలవులు లభించబోతున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook