School Holidays: రేపు, ఎల్లుండి స్కూళ్లకు సెలవు..ఇప్పుడే ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం..భారీ వర్ష సూచన!

School Holidays News: రేపు అనగా నవంబరు 8న కొన్ని పాఠశాలలకు సెలవుగా ప్రకటించారు. కొందరికి రెండో శనివారం కారణంగా సెలవు లభిస్తుండగా.. మరికొందరికి ప్రభుత్వాలు ప్రత్యేకంగా సెలవులను ప్రకటించాయి. 

Written by - Harish Darla | Last Updated : Nov 7, 2025, 07:10 PM IST
School Holidays: రేపు, ఎల్లుండి స్కూళ్లకు సెలవు..ఇప్పుడే ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం..భారీ వర్ష సూచన!

School Holidays News: నవంబర్ సమీపిస్తున్న కొద్దీ భారతదేశం అంతటా విద్యార్థులు, తల్లిదండ్రులు టూర్ ప్లాన్స్ చేస్తుంటారు. వాటి కోసం స్కూళ్లకు ఆఫీసులకు సెలవులు ఎప్పుడొస్తాయా అంటూ తెగ ఎదురుచూస్తారు. అయితే దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న విద్యాశాఖ బోర్డుల వారీగా సిలబస్‌లు సెలవులు మారుతూ ఉంటాయి. ఈ క్రమంలో రేపు అనగా నవంబరు 8న కొన్ని పాఠశాలలకు సెలవుగా ప్రకటించారు. కొందరికి రెండో శనివారం కారణంగా సెలవు లభిస్తుండగా.. మరికొందరికి ప్రభుత్వాలు ప్రత్యేకంగా సెలవులను ప్రకటించాయి. 

Add Zee News as a Preferred Source

Also Read: Gold Mining: అత్యంత స్వచ్ఛమైన బంగారం ఎక్కడ అమ్ముతారో తెలుసా? అందుకే దీనికి అంత డిమాండ్!

8 నవంబర్ 2025 భారతదేశంలో పాఠశాలలకు సెలవేనా?
చాలా రాష్ట్ర ప్రభుత్వాలు, విద్యా శాఖలు విడుదల చేసిన 2025 సెలవుల క్యాలెండర్‌ల ప్రకారం.. 8 నవంబర్ 2025 (శనివారం) దేశవ్యాప్తంగా పాఠశాలలకు సెలవుదినం కాదు. అయితే, స్థానిక పండుగలు, ప్రాంతీయ కార్యక్రమాలను బట్టి సెలవులను పాటించడం తరచుగా ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి మారుతుంది. కొన్ని రాష్ట్రాల్లో, స్థానిక వేడుకలు, మతపరమైన పండుగ లేదా వారాంతపు సెలవులతో (శనివారం సెలవు షెడ్యూల్‌ను అనుసరించే పాఠశాలలకు) సమానంగా ఉంటే ఈ రోజున పాఠశాలలు మూసివేయవచ్చు. అందువల్ల, నిర్ధారణ కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు స్థానిక పాఠశాల సెలవుల జాబితాను లేదా అధికారిక విద్యా శాఖ నోటిఫికేషన్‌ను తనిఖీ చేయడం మంచిది.

కర్ణాటక పాఠశాలలకు రేపు సెలవు
కర్ణాటకలో, 8 నవంబర్ 2025 విష్ణువుకు ఇష్టమైన ఎంతో పవిత్రమైన రోజు.. హిందువులు ఉపవాసం ఉండి పూజలు చేసేందుకు దేవాలయాలకు వెళ్తారు. ఈ పర్వదినాన కర్ణాటకలోని కొన్ని పాఠశాలలకు సెలవుగా ప్రకటించారు. అయితే ప్రభుత్వం దీన్ని అధికారికంగా సెలవు ఇవ్వలేదు. కొన్ని ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలు తమ ఆప్షనల్ హాలీడేని ఉపయోగించుకున్నారు. 

వర్షం కారణంగా తమిళనాడు పాఠశాలలకు సెలవు
తమిళనాడులో భారీ తుపాను కారణంగా నవంబరు 11 వరకు భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణశాఖ తెలిపింది. ఈ క్రమంలో చెన్నైలోని వర్షాభావ, లోతట్టు ప్రాంతాల ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. తుపాను కారణంగా అవసరం ఉంటే తప్ప బయటకు రావొద్దని జిల్లా యంత్రాంగం ప్రజలకు సూచించింది. 

ALso Read: Saturn Transit: శనిదేవుని అనుగ్రహంతో ఈ రాశుల వారు విదేశాలకు వెళ్తారు..ఉద్యోగాలు ఖాయం అవుతాయి!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

About the Author

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్ డిజిటల్ మీడియాలో జర్నలిస్ట్‌గా పనిచేస్తున్నారు.  గత 7 ఏళ్ల అనుభవంతో ఇక్కడ 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.

...Read More

Trending News