)
Bus catches fire incident at Jaisalmer jodhpur highway Rajasthan: ఇటీవల కాలంలో బస్సు ప్రమాదాలు, రైల్వేలు, విమాన ప్రమాదాలు తరచుగా వార్తలలో ఉంటున్నాయి. దీంతో చాలా మంది అసలు ఇంటి నుంచి బైటకు వెళ్లిన వారు తిరిగి సెఫ్టీగా రావడం పెద్ద టెన్షన్గామారింది. కొన్నిసార్లు టెక్నికల్ సమస్యలు తలెత్తడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.
जैसलमेर से दुखद खबर
एक सवारियों से भरी बस में आग लगने की खबर , कई लोगों के आग की सपेट आने की खबर। @dineshbohrabmr @ashokshera94 @JATbera1 @dineshdangi84 @ pic.twitter.com/34tJ87xrM5— BR Beniwal (@BRBeniwal98) October 14, 2025
మరికొన్ని సార్లు అనుకొని ఫైర్ యాక్సిడెంట్ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా.. రాజస్తాన్ లోని జైసల్మేర్ లో షాకింగ్ ఘటన సంభవించింది. తైయాట్ ప్రాంతంలోని మిలటరీ స్టేషన్ సమీపంలో ఒక బస్సులో మంటలు అంటుకున్నాయి. జైసల్మేర్ జోధ్ పూర్ హైవేమీద వెళ్తున్న ప్రైవేటు బస్సుకు మంటలు అంటుకున్నాయి.
చూస్తుండగానే అవి బస్సు అంతా వ్యాపించాయి. దీంతో బస్సులోని ప్రయాణికులు గట్టిగా కేకలు పెట్టారు. ప్రమాదం సమయంలో బస్సులో 57 మంది ప్రయాణికులు ఉన్నారు. ఘటనలోనే 12 మంది సజీవదహనం అయ్యారు.
మరో 32 మందిని స్థానికులు కాపాడి దగ్గరలోని ఆస్పత్రులకు తరలించారు. పెద్ద ఎత్తున అంబులెన్స్ లు, ఫైర్ సర్వీసులు అక్కడకు వెళ్లాయి. పోలీసులు, స్థానికులతో కలసి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఈ ప్రమాదంకు చెందిన ఘటనలో బస్సు కాలిపోతున్న వీడియో వైరల్గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook