Pahalgam Terror Attack: కొన్నాళ్లుగా ప్రశాంతంగా ఉన్న జమ్ము కశ్మీర్లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేయగా ముగ్గురు మరణించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఉగ్రదాడిలో విస్తుగొలిపే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. హిందువులే లక్ష్యంగా తీవ్రవాదులు కాల్పులకు తెగబడుతున్నారని సంచలనం విషయం బయటపడింది. ఈ అంశం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. బొట్టు పెట్టుకున్న వాళ్లు కనిపిస్తే చాలు కిరాతకంగా కాల్చి చంపారని అక్కడి అధికారులు చెబుతున్నారు. పేర్లు అడిగి హిందువుల పేర్లు ఉంటే విచ్చవిలడిగా కాల్పలు జరిపినట్లు తెలుస్తోంది. హిందువులపై నరనరాన విషాన్ని నింపుకున్నట్లు ఉగ్రవాదుల తీరు కనిపిస్తోంది.
Also Read: KTR: లగచర్ల ఆడబిడ్డలకు సారీ చెప్పి రేవంత్ రెడ్డి సీఎం పదవికి రాజీనామా చేయాలి: కేటీఆర్
పహల్ గామ్ తీవ్రవాదుల కాల్పుల ఘటనలో 28 మందికి పైగా మరణించినట్లు సమాచారం. పదుల సంఖ్యలో అక్కడి ప్రజలు, పర్యాటకులకు గాయాలయ్యాయి. వారిని వెంటనే భారీ భద్రత నడుమ ఆసుపత్రికి తరలించారు. ఈ దుర్ఘటనతో యగగపహల్గామ్ అంతటా రెడ్ అలర్ట్ ప్రకటించారు. తీవ్రవాదుల కోసం భద్రతా బలగాలు అణువణువు గాలింపు చేపట్టాయి. దీంతో పహల్గామ్ ప్రాంతంలో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. పర్యాటకులు కూడా భయాందోళన చెందుతున్నారు. ఉగ్రదాడితో జమ్మూ కశ్మీర్ మొత్తం భద్రతను కట్టుదిట్టం చేశారు.
Also Read: Singer Sunitha: 'అప్పుడు ముద్దు చేశా.. ఈ వయసులో చేస్తే బాగుండదు': సింగర్ సునీత
పహల్గామ్ మారణహోమం వెనుక లష్కరే తోయిబా హస్తం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ దాడిలో 10 మంది ఉగ్రవాదులు పాల్గొన్నట్లు ప్రాథమికంగా నిర్ధారణ చేశారు. వీరిలో ఆరుగురు స్థానికులు కాగా మరో నలుగురు విదేశీ తీవ్రవాదులుగా పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. అత్యాధునిక ఆయుధాలతో కాల్పులకు తెగబడినట్టు భద్రతా బలగాలు చెబుతున్నాయి. అబూ ముస్సా పిలుపునిచ్చిన కొద్దిరోజులకే ఈ ఘటన జరగడం ఇప్పుడు సంచలనంగా రేపుతోంది.
పహల్గామ్ ఉగ్రదాడిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోపాటు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు అందరూ తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో అమిత్ షా శ్రీనగర్లో పర్యటించే అవకాశం ఉంది. ఇప్పటికే తీవ్రవాదులను మట్టుబెట్టేందుకు ప్రత్యేక బృందం రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. పుల్వామా దాడి ఘటన తర్వాత ఈస్థాయిలో దాడి జరగడం ఇదే ప్రథమం. ఉగ్రదాడిని నిరసిస్తూ దేశ వ్యాప్తంగా ఆందోళన చేపడుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.