
Student Forced To Remove Sacred Thread: ఏప్రిల్ 16వ తేదీన జరిగిన కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (CET) ఎగ్జామ్ రాయడానికి వచ్చిన ఇద్దరు విద్యార్థులను కర్ణాటకలోని శివ మొగ్గ కళాశాలలో అనుమతించలేదు. ప్రధానంగా వాళ్లు జంజం (యజ్ఞోపవితం) ధరించారని దాని తొలగించిన తర్వాతనే పరీక్షకు అనుమతి ఉంటుందని బలవంతంగా తీయించారు. మరో విద్యార్థి నుంచి రుద్రాక్ష మాలను కూడా తీసిన తర్వాతే పరీక్షకు అనుమతి ఇచ్చారు. ఈ నేపథ్యంలో బ్రాహ్మణ సంఘం తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఇలా మత భావాలను కించపరిచేలా చేసినందుకు కేంద్రం జవాబుదారీ అని డిమాండ్ చేశారు
ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే కేవీ ప్రసన్నకుమార్ ఆధ్వర్యంలో బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు డిప్యూటీ కమిషనర్ గురుదత్త హెగ్డేకు ఫిర్యాదు చేశారు. శివ మొగ్గలోని సీఈటి పరీక్ష జరుగుతున్న కళాశాలలో రుద్రాక్ష మాల, జంజం తీసే వరకు వాళ్లను పరీక్ష గదిలోకి అనుమతించలేదని ఫిర్యాదు చేశారు. అయితే ముగ్గురు విద్యార్థులను తీయమని అడగగా అందులో ఒకరు వ్యతిరేకించారు. దాన్ని తీయకుండానే పరీక్ష హాల్లోకి ప్రవేశించారు. మిగతా ఇద్దరు విద్యార్థులు జంజం తీయగానే దాన్ని చెత్తబుట్టలో పడేశారు అని ఆరోపించింది బ్రాహ్మణ సంఘం. దీనిపై తీవ్రస్థాయిలో మండిపడుతోంది. తగిన క్రమశిక్షణ చర్యలు కూడా కాలేజీ యాజమాన్యం పై తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. అంతేకాదు చేతికి కట్టిన కాశీ దారాన్ని కూడా తొలగించమని అడగడం దురదృష్టం అని బ్రాహ్మణ సంఘం వారు ఆగ్రహిస్తున్నారు .
ఏ పరీక్ష ఆయన విద్యార్థికి ఎంతో ముఖ్యమైంది. వారి జీవితానికి ఒక మైలురాయి. కానీ, ఈ సమయంలో ఇలా హిందూ ఆచారాలకు విరుద్ధంగా వ్యవహరించడం తగినది కాదని బ్రాహ్మణ సంఘ ప్రతినిధులు చెబుతున్నారు. డిప్యూటీ కమిషనర్ ఈ విషయంపై దర్యాప్తు చేసి సంబంధిత అధికారులను నివేదిక ప్రకటిస్తామని చెప్పారు. ఇలాంటి ఘటనలకు పాల్పడకూడదు అని అధికారులకు కూడా ఆదేశించారు.
అయితే కేవలం సెక్యూరిటీ గార్డు మాత్రమే కఠినంగా ఉండి రుద్రాక్ష, జంజం తీసిన తర్వాతే కాలేజీ లోపలికి అనుమతించినట్లు కాలేజీ యాజమాన్యం చెప్పిందని డిప్యూటీ కమిషనర్ సిద్దాలింగారెడ్డి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మరో ఇద్దరు విద్యార్థులు మాత్రం జంజం, రుద్రాక్ష తీసి ఎగ్జామ్ రాసిన తర్వాత మళ్లీ వాళ్లకు తిరిగి ఇచ్చేశారని యాజమాన్యం చెప్పుకొచ్చింది.
అయితే, బ్రాహ్మణ సంఘవారు కొంతమంది నిరసన చేపట్టారు. పరీక్ష సజావుగా సాగేందుకు పోలీసులు వాళ్లను చెదరగొట్టారు. పరీక్ష ఎలాంటి సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా సాగింది. అయితే గతంలోనూ రాజస్థాన్లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. అక్కడి పరీక్ష కేంద్రంలోకి కూడా ఇలాగే జంజం తీసేసిన తర్వాతనే పరీక్ష హాల్లోకి అనుమతించారు. అప్పట్లో రాష్ట్ర అసెంబ్లీలో కూడా దీనిపై చర్చ జరిగింది. ఒక ఉపాధ్యాయుడు, పర్యావేక్షకుడిని కూడా సస్పెండ్ చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe