
Supreme Court on Wakf: ఇటీవల పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించిన వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పెద్దఎత్తున పిటీషన్లు దాఖలయ్యాయి. ఇవాళ ఈ పిటీషన్లపై విచారణ జరిగింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసిన అత్యున్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వం సహా ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ చట్టంలోని కొన్ని సెక్షన్లు రాజ్యాంగానికి విరుద్ధమే కాకుండా జాతీయ సమగ్రతకు భంగం కల్గించేవిగా ఉన్నాయంటూ ప్రతిపక్షాలతో పాటు కొన్ని సంస్థలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ, కాంగ్రెస్ ఎంపీ మొహమ్మద్ జావేద్, జేడీయూ, ఆప్, డీఎంకే, సీపీఐ, వైఎస్సార్సీపీతో పాటు జమాత్ ఉలేమా హింద్, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ సంస్థలు పిటీషన్లు వేశాయి. వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరుల్ని చేర్చడం రాజ్యాంగ విరుద్ధమని వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. అదే సమయంలో బీజేపీ పాలిత రాష్ట్రాలు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, అస్సోం, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు ఈ చట్టానికి అనుకూలంగా పిటీషన్ వేశాయి. కేంద్ర ప్రభుత్వం కేవియట్ పిటీషన్ దాఖలు చేసింది.
ఈ పిటీషన్లను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ కూడిన త్రి సభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసి కీలక వ్యాఖ్యలు చేసింది. కొన్ని ప్రతిపాదనలు చేసింది. పిటీషనర్లు లేవనెత్తిన అంశాలకు సమాధానం చెప్పాలని న్యాయస్థానం ఆదేశించింది. రేపు మద్యాహ్నం మరోసారి విచారణ జరగనుంది.
సుదీర్ఘకాలంగా ముస్లిం కార్యక్రమాలకు వినియోగిస్తున్న వక్ఫ్ చేసిన ఆస్తుల్ని డీ నోటిఫై చేస్తే చాలా సమస్యలు తలెత్తుతాయని కోర్టు అభిప్రాయపడింది. వక్ఫ్ ఆస్తుల్ని రిజిస్టర్ చేయడం కష్టమేనని ఇది దుర్వినియోగమైందని తెలిపింది. అయితే హిందూవుల ఆస్తుల్ని హిందూవులే నిర్వహిస్తున్నాయి కదా అని ప్రశ్నించింది. పార్లమెంట్కు చట్టాలు చేసే అధికారం లేదా, హిందూవుల కోసం కూడా చట్టాలు చేస్తోంది కదా అని సుప్రీంకోర్టు తెలిపింది. చారిత్రక, పురావస్తు ఆస్తుల్ని వక్ఫ్ ఆస్తులుగా ప్రకటించడానికి వీల్లేదని తెలిపింది.
వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంకోర్టు ప్రతిపాదించిన ఉత్తర్వులు
కేసు విచారణ సమయంలో వక్ఫ్గా కోర్టు ప్రకటించిన ఆస్తుల్ని డీ నోటిఫై చేయకూడదు. వక్ఫ్ బై యూజర్ లేదా వక్ఫ్ బై డీడ్ ఆస్తుల్ని డీ నోటిపై చేయవద్దు. వక్ఫ్ భూమా లేదా ప్రభుత్వ భూమా అనే అంశంపై కలెక్టర్ విచారణ చేస్తున్నప్పుడు వక్ఫ్ సవరణ చట్టం నిబంధనలు అమలు చేయవద్దు. వక్ఫ్ బోర్డు, సెంట్రల్ కౌన్సిల్ ఎక్స్ అఫీషియో సభ్యులు తప్పించి మిగిలిన వారంతా ముస్లింలే ఉండాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి