)
Supreme court orders cbi investigation in Karun tvk rally stampede: తమిళనాడులోని కరూర్ లో టీవీకే పార్టీ తొక్కిసలాట ఘటన దేశంలో సంచలనంగా మారింది. విజయ్ దళపతికి చెందిన పార్టీ మీటింగ్ లో ఒక్కసారిగా తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో 41 మంది దుర్మరణం చెందారు. ఈ క్రమంలో దీనిపై దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు ఘటన జరగగానే విజయ్ దళపతి అక్కడి నుంచి వెళ్లిపోవడం కూడా పెద్ద దుమారంగా మారింది .
మద్రాస్ హైకోర్టు సైతం విజయ్ పై కీలక వ్యాఖ్యలు చేసింది. దీనిపై స్టాలీన్ ప్రభుత్వం ఇప్పటికే ఏక సభ్య కమిటినీ ఏర్పాటు చేసింది. అయితే.. దీనిపై విజయ్ దళపతి సీబీఐ విచారణ జరిపించాలని మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే.. కోర్టు నుంచి ఎదురుదెబ్బ ఎదురు కావడంతో.. సుప్రీంకోర్టులో పిటిషన్ ను దాఖలు చేశారు.
తాజాగా.. దీనిపై విచారణ చేపట్టిన అత్యున్నత ధర్మాసనం.. కరూర్ ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశించింది. అంతేకాకుండా.. అజయ్ రస్తోగి నేతృత్వం.. తమిళనాడు కేడర్కు చెందిన మరో ఇద్దరు ఐపీఎస్ అధికారులతో కూడిన కమిషన్ ను విచారణ చేపట్టాలని జెకె మహేశ్వరి, ఎన్వి అంజరియాలతో కూడిన ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం ఆదేశించింది.
మరోవైపు..సెప్టెంబర్ 27న జరిగిన కరూర్ తొక్కిసలాటలో 41 మంది మృతి చెందగా, వందలాది మంది గాయపడిన ఘటనపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) దర్యాప్తుకు సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది.
ఈ ఘటనపై కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని కోరుతూ నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ తమిళగ వెట్రీ కజగం (టివికె) దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన కోర్టు, కేంద్ర దర్యాప్తు సంస్థ దర్యాప్తును పర్యవేక్షించడానికి ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేస్తు ఆదేశాలు జారీ చేసింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook