Tamil Nadu Girl: విద్యార్థినికి పీరియడ్స్ ఘటనలో బిగ్ ట్విస్ట్.. వెలుగులోకి షాకింగ్ నిజం.. సీరియస్ అయిన ఖుష్బూ..

Khushbu Serious on Class girl incident: ఇటీవల తమిళనాడులో బాలికకు పీరియడ్స్ వచ్చాయని క్లాస్ బైట కూర్చొబెట్టి మరీ ఎగ్జామ్ రాయించారు.ఈ ఘటనకు చెందిన వీడియో వైరల్ కావడంతో దేశ వ్యాప్తంగా ఈ ఘటనపై దుమారం చెలరేగింది. ఈ ఘటనపై అసలు మనం ఏ కాలంలో ఉన్నామని మండిపడుతున్నారు.

Written by - Inamdar Paresh | Last Updated : Apr 11, 2025, 07:31 PM IST
  • మరోసారి వార్తల్లో నిలిచిన తమిళనాడు ఘటన..
  • స్పందించిన ఖుష్బు..
Tamil Nadu Girl: విద్యార్థినికి పీరియడ్స్ ఘటనలో బిగ్ ట్విస్ట్.. వెలుగులోకి షాకింగ్ నిజం.. సీరియస్ అయిన ఖుష్బూ..

Khushbu Reacts on Tamil nadu girl periods issue: తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లా కినత్తుకడవై లో ఇటీవల అమానవీయకర ఘటన చోటు చేసుకుంది. ఒక ప్రైవేటు స్కూల్ లో ఎనిమిదో తరగతి చదువుతున్న బాలికకు పీరియడ్స్ వచ్చాయి. దీంతో ఆమెకు స్కూల్ లో ఆరుబైట కూర్చోబెట్టి మరీ ఎగ్జామ్ రాయించారు. అయితే.. దీనిపై  బాలిక తల్లి స్కూల్ కు వచ్చి వీడియో తీసి పాఠశాల యాజామాన్యంను ప్రశ్నించింది. వారు సరిగ్గా సమాధానం చెప్పకపోవడంతొ సోషల్ మీడియాలో ఈ ఘటనను పోస్ట్ చేసింది.

Add Zee News as a Preferred Source

దీంతో అది కాస్త వైరల్ కావడంతో దీనిపై విద్యాశాఖ, జిల్లా అధికారులు సీరియస్ అయ్యారు. ఘటనపై విచారణకు ఆదేశించారు.ఈ క్రమంలో అధికారులు ఆ స్కూల్ కు వచ్చి విచారణ చేపట్టగా.. విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాలిక ఈనెల 5న రజస్వల అయ్యింది.ఆతర్వాత 7,9 వతేదీల్లో ఆమెకు స్కూల్ లో ఫైనల్ ఎగ్జామ్ లను నిర్వహించారు. అయితే.. బాలిక తమ పిల్లలతో కలిస్తే.. అంటు (ముట్టు) అవుతుందని.. మిగత స్టూడెంట్స్ వాళ్ల తల్లిదండ్రులు అభ్యంతరం చెప్పారని, దీంతో చేసేది లేక.. సిబ్బంది ఆరుబైట కూర్చొబెట్టి ఎగ్జామ్ రాయించామని స్కూల్ సిబ్బంది స్పష్టం చేశారు.

అయితే.. దీనిలో తమ తప్పులేదని స్కూల్ సిబ్బంది క్లారిటీ ఇచ్చారు. ఈ క్రమంలో అసలు.. ఒక అమ్మాయిని ఇలా చేయడం వివక్ష కిందకు రాదా.. అని సదరు అధికారులు స్కూల్ సిబ్బందికి కౌంటర్ ప్రశ్నలు వేశారు. దీంతొ పొంతన లేని సమాధానం చెప్పడంతో.. హెచ్ ఎంను సస్పెండ్ చేశారు. అదే విధంగా దీనికి కారణమైన వారిపై చర్యలు తీసుకొవాలని ఆదేశించారు.

Read more: Viral Video: స్కూల్లో అమానవీయం.. పీరియడ్స్ వచ్చిందని బాలికను ఆరుబైట కూర్చొబెట్టి ఎగ్జామ్.. వీడియో వైరల్..

అయితే.. దీనిపై తాజాగా.. జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ సైతం స్పందించారు. అసలు.. మీరు మనుషులేనా.. మనం ఇంకా ఏ యుగంలో ఉంటున్నామని ఎమోషనల్ అయ్యారు. నెలసరి అనేది చాలా సాధారణ ప్రక్రియ. మానసిక పరిపక్వత లేకుండా.. ఇంత నీచంగా ప్రవర్తిస్తారా.. అంటూ ఖుష్బు దీనిపై మండిపడ్డారు. ఇలాంటి వాటికి పాల్పడిన వారికి సరైన విధంగా బుద్ది చెప్పాలని కూడా నటి ఖుష్బూ సీరియస్ వ్యాఖ్యలు చేశారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News