)
Teen Girl gang raped infront of boyfriend near puri beach: ఒడిశాలోని పూరీ బీచ్ లో దారుణం చోటు చేసుకుంది. తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి బీచ్ కు వచ్చిన యువతిపై కామాంధులు దాడులు చేసి అత్యాచారం చేశారు. ఈ ఘటన ఒడిశా వ్యాప్తంగా సంచలనంగా మారింది.
గంజామ్ జిల్లాలోని గోపాల్పుర ఏరియా బీచ్లో ఈ ఘటన జరిగింది. 20 ఏళ్ల యువతి స్థానికంగా ఓ ప్రైవేటు కాలేజీలో చదువుతోంది. ఈ క్రమంలో తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి బీచ్ కు వెళ్లింది. అక్కడ కొంత మంది ఆకతాయిలు వచ్చి వీరికదలికల్ని ఫోన్ లలో రికార్డు చేశారు. ఆ తర్వాత వీరి వద్దకు వచ్చి డబ్బుల్ని డిమాండ్ చేశారు. ఇంతలో వారితో వాగ్వాదం జరిగింది.
అప్పుడు ఆకతాయిలు.. ఆమె బాయ్ ఫ్రెండ్ ను అక్కడే కట్టేసి, యువతిపై సాముహిక అత్యాచారంకు పాల్పడ్డారు. ఆదివారం రాత్రి ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత యువకుడు, యువతి ధైర్యం చేసుకుని తమ వాళ్లకు చెప్పి, స్థానకంగా ఉన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పోలీసులు రంగంలోకి ముగ్గురు నిందితుల్ని అరెస్ట్ చేశారు.
మరోవైపు.. బీచ్కు వచ్చినవాళ్లు స్థానికులు కాదని, రాజా ఫెస్టివల్ సందర్భంగా ఇతరులు వాళ్లు అక్కడకు వచ్చినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. బాధితురాలు, నిందితులకు మెడికల్ టెస్ట్ నిర్వహించనున్నారు. ఈ ఘటన పెనుదుమారంగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook