Revanth on Pahalgam Attack: ఆ నా కొడుకులను ఏసెయ్యండి సర్.. మోడీకి రేవంత్ ఫుల్ సపోర్ట్..

Revanth on Pahalgam Attack: పాపాల పాకిస్తాన్‌ను దెబ్బకొట్టేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర  మోడీ ఏ నిర్ణయం తీసుకున్నా మద్దతిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి  రేవంత్‌రెడ్డి అన్నారు. పాకిస్తాన్‌ను రెండు ముక్కలు చేయాలన్నారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 26, 2025, 09:54 AM IST
Revanth on Pahalgam Attack: ఆ నా కొడుకులను ఏసెయ్యండి సర్.. మోడీకి రేవంత్ ఫుల్ సపోర్ట్..

Revanth on Pahalgam Attack: జమ్ము కశ్మీర్ లోని అనంత్ నాగ్ జిల్లాలోని పహల్గామ్ లోని మినీ స్విట్జర్లాండ్ గా పిలుచుకునే బైసరన్ లోయలో  ఈ నెల 22న జరిగిన ఉగ్రదాడిలో సామాన్యులు కన్నుమూసారు. అంతేకాదు అత్యంత పాశవికంగా వారు హిందువులా కాదా అని నిర్ధారించుకొని మరి కాల్చి చంపినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అంతేకాదు కొంత మంది బొట్టు పెట్టుకున్న హిందువులను టార్గెట్ చేసుకొని ఈ దాడులకు తెగపడినట్టు తెలుస్తోంది. ఇందులో ఇంటెలిజెన్స్ వైఫల్యం అని చెబుతున్నా.. ఈ ప్రదేశం జూన్ వరకు బంద్ ఉంటుందని చెబుతున్నారు. అక్కడ స్థానికంగా ఉండే కొంత మంది గైడ్స్.. ప్రభుత్వంలోని కొంత మంది కుమ్మక్కై  టూరిస్టులను ఆ ప్రదేశానికి చేరుకునేలా చేసి ఈ ఉగ్రచర్యలకు పాల్పడ్టు తెలుస్తుంది.

మరోవైపు ఈ ఉగ్రదాడిలో పాల్గొన్న ఇద్దరు భారతీయులు కాగా.. వారికి సంబంధించిన ఇంటిని భారత ఆర్మీ నేలమట్టం చేసింది. ఇక ఈ ఘటన నేపథ్యంలో హైదరాబాద్ ముస్లిమ్ పార్టీ అయిన ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ .. పాకిస్థాన్ కు వ్యతిరేకంగా హిందుస్థాన్ కు అనుకూలంగా పాతబస్తీలో ర్యాలీ నిర్వహించడం ఆహ్వానించదగ్గ పరిణామం. ఆయన మాట్లాడుతూ.. ముస్లిమ్స్ అంతా ఉగ్రవాదులు కాదు.. కానీ ఉగ్రవాదులందరు ముస్లిమ్స్ అని ఆయన చెప్పడం గమనార్హం.

మరోవైపు పహల్గామ్ ఉగ్రదాడికి వ్యతిరేకంగా తెలంగాణ సీఎం క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా భారత ప్రభుత్వానికి తన పూర్తి మద్ధతు ప్రకటించారు. పాకిస్థాన్ కు బుద్ధి చెప్పండి సార్.. పీవోకేను భారత్‌లో కలపాలని చెప్పారు. అందరం ఏకమై తీవ్రవాదాన్ని అంతం చేసి ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలన్నారు. 1971లో పాకిస్థాన్‌కు ఇందిరాగాంధీ గట్టిగా బుద్ధి చెప్పారని..ఆనాడు ఇందిరాగాంధీని దుర్గామాతతో వాజ్‌పేయీ పోల్చారని గుర్తు చేశారు. పహల్గాం ఉగ్రదాడిని నిరసిస్తూ హైదరాబాద్‌లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. పీపుల్స్‌ ప్లాజా నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు ప్రదర్శన చేపట్టారు. ఈ ప్రదర్శనలో సీఎం రేవంత్‌ రెడ్డి సహా ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ, భారత్‌ సమ్మిట్‌కు వచ్చిన విదేశీ ప్రతినిధులు పాల్గొన్నారు. అయితే ఈ సమ్మిట్ లో జమ్ము కాశ్మీర్, లడ్డాక్, పీవోకే లేకుండా భారత దేశ మ్యాప్ ప్రదర్శించడంపై తెలంగాణ ప్రభుత్వంపై నెటిజన్స్ దుమ్మెత్తి పోస్తున్నారు.

ఇదీ చదవండి: బడా స్టార్స్ సహా 900 సినిమాల్లో నటించిన నటి.. భర్త చనిపోవడంతో తాగుడుకు బానిసై జీవితం నాశనం..

ఇదీ చదవండి:  ఈ చెట్లు ఉంటే.. పాములకు మీ ఇంట్లోకి రెడ్ కార్పెట్ పరిచినట్టే.. తస్మాత్ జాగ్రత్త..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News