Three Trains meets on The same track in Bilaspur railway station: ఇటీవల దేశంలో బస్సు ప్రమాదాలు, రైళ్ల ప్రమాదాలు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి. ప్రజలు అసలు బస్సులు, ట్రైన్ ఎక్కాలంటేనే బిక్కు బిక్కు మంటున్నారు. రోడ్లు, రైల్వే స్టేషన్ లలో ప్రమాదాలు ఇటీవల ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల ఛత్తీస్ గఢ్ లోని బిలాస్ పూర్ లో రెండు రైళ్లు ఢీకొన్నాయి. ప్యాసింజర్, గూడ్స్ రైళ్లు ఎదురెదురుగా వచ్చి బలంగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆరుగురు స్పాట్లోనే చనిపోయారు. రెండు రైళ్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి.
మరోవైపు అనేక మంది గాయాలపాలయ్యారు. ఈ ఘటన మరువక ముందే అదే చోట మరో ఘోరం వెలుగులోకి వచ్చింది.
బిలాస్ పూర్ లోని రైల్వేస్టేషన్లో ఏకంగా మూడు రైళ్లు ఒకే ప్లాట్ ఫామ్ మీదకు వచ్చాయి.
ప్యాసింజర్, రెండు గూడ్స్ రైళ్లు ఒకే ప్లాట్ ఫామ్ మీదకు వచ్చాయి. ప్యాసింజర్ రైలు ప్లాట్ ఫామ్ మీద ఆగి ఉంది. దీంతో మరో రెండు రైళ్లు వెనక వస్తుండం చూసిన ప్రయాణికులు ప్రాణ భయంతో పరుగులు పెట్టారు.
అప్పటికే లోకోపైలెట్ లు అప్రమత్తమై రెప్పపాటులో రైళ్లను ఆపేశారు. మరీ సిగ్నలింగ్ తప్పిదమో లేదా.. మరే టెక్నికల్ సమస్యనో తెలీదు కానీ.. మొత్తంగా మూడు రైళ్లు ఒకే ప్లాన్ ఫామ్ మీదకు వచ్చిన ఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది. దీనిపై రైల్వే అధికారులు విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook









