)
Schools And Colleges Holiday: భారతదేశంలో సెప్టెంబర్ నెల కీలకంగా మారింది. భారీగా పండుగలు రావడంతో దేశవ్యాప్తంగా సెలవులు లభిస్తున్నాయి. అటు విద్యార్థులతోపాటు ప్రభుత్వ ఉద్యోగులు, బ్యాంకు ఉద్యోగులకు సెలవులు వస్తున్నాయి. తాజాగా బుధవారం కూడా అకస్మాత్తుగా సెలవు లభించింది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు కళాశాలలతోపాటు ప్రభుత్వ కార్యాలయాలకు కూడా సెలవు వచ్చేసింది. అయితే ఈ సెలవు తెలుగు రాష్ట్రాల్లో కాదు కేరళలోని పతనంతిట్ట జిల్లాలో. ఆ జిల్లాలో జరుగుతున్న పడవల పోటీ సందర్భంగా సెలవు ప్రకటించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రకృతి అందాలకు.. అద్భుతమైన దేవాలయాలు.. పర్యాటక ప్రాంతానికి కేరళ రాష్ట్రం కేంద్రంగా ఉంది. సుదీర్ఘ తీర ప్రాంతం కలిగిన కేరళలో పడవ పోటీలు జరుగుతుంటాయి. పతనంతిట్ట జిల్లాలో జరగనున్న పడవల పోటీ సందర్భంగా ప్రభుత్వం సెలవు ప్రకటించినట్లు తెలుస్తోంది. అరణ్ముల ఉత్రట్టత్తి పడవల పోటీలు ఎంతో ఉత్సాహంగా.. వైభవంగా జరుగుతుంటాయి. సెప్టెంబర్ 9, 10వ తేదీన జరుగుతున్నట్లు సమాచారం. ఈ పోటీల కోసం మంగళవారం, బుధవారం పతనంతిట్ట జిల్లాలో ప్రాంతీయ సెలవు ప్రకటించినట్లు తెలుస్తోంది.
ప్రభుత్వ కార్యాలయాలు, అంగన్వాడీలు, ప్రొఫెషనల్ కళాశాలలు సహా విద్యా సంస్థలకు సెలవు వర్తిస్తుందని పతనంతిట్ట జిల్లా కలెక్టర్ ఎస్ ప్రేమ్కృష్ణన్ ప్రకటించారు. ముందుగా నిర్ణయించిన పరీక్షలు ప్రణాళిక ప్రకారం సెలవు ఇస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఏడాది పత్తనంతిట్ట జిల్లాలో అరణ్ముల ఉత్రట్టత్తి పడవల పోటీలు నిర్వహిస్తుంటారు. అరణ్ముల పడవల పోటీకి పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తుంటారు. దీంతోపాటు ఓనం వారోత్సవాల ముగింపు ఊరేగింపు కూడా నిర్వహిస్తుంటారు. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ చట్టం ప్రకారం పతనంతిట్ట నగరంలోని అన్ని ప్రభుత్వ, సెమీ-ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు మూసివేస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ ఉత్సవాల సందర్భంగా పత్తనంతిట్ట జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ఇచ్చారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.