)
Train Accident: భారతీయ రైల్వేలు గతంలో కంటే మెరుగ్గా ఉన్నాయి. యాక్సిడెంట్లు గత పదేళ్లలో చాలా మటుకు తగ్గాయి. అయినా.. అక్కడక్కడ కొన్ని సంఘటనలు ప్రజలను భయ భ్రాంతులకు గురి చేస్తున్నాయి. తాజాగా ఛత్తీస్గఢ్లో రెండు రైళ్లు ఢీకొన్నాయి.ఛత్తీస్ గడ్ రాష్ట్రంలోని బిలాస్పుర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఎనిమిది మృతి చెందినట్లు తెలుస్తోంది. సాయంత్రం నాలుగు గంటల సమయంలో లాల్ఖదాన్ ప్రాంతంలో మెము ప్యాసింజర్-గూడ్స్ రైళ్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. దాంతో పలు బోగీలు పట్టాలు తప్పాయి.
ఈ ప్రమాదంతో బిలాస్పుర్-హావ్డా లైన్ మార్గంలో రైళ్లరాకపోకలకు పూర్తి అంతరాయం ఏర్పడింది. దాంతో పలు సర్వీసులను రద్దు చేశారు. మరి కొన్నింటిని దారి మళ్లించారు. ఈ ఘటన వల్ల ఆ మార్గంలో ఎలక్ట్రిక్ వైర్లు, సిగ్నల్ వ్యవస్థలు దెబ్బతిన్నాయి.
ప్రమాదంపై సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలికి చేరుకొని సహాయచర్యలు చేపట్టారు. వైద్య సిబ్బంది ప్రమాదస్థలికి చేరుకున్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. దెబ్బతిన్న కోచ్లను పట్టాల నుంచి తొలగిస్తున్నారు. అయితే ప్రమాద తీవ్రత తక్కువగా ఉండటంతో కొద్ది మంది ప్రాణాలు మాత్రమే పోయాయి. అయితే ఈ ఘటన వెనక ఏదైనా కుట్ర ఉందా అనే కోణంలో రైల్వే శాఖ దర్యాప్తు చేస్తోంది. మరోవైపు రైల్వే శాఖ నిర్లక్ష్యం ఉందా అనే కోణంలో డిపార్టుమెంటల్ ఎంక్వైరీకి ఆదేశించారు. ఏది ఏమైనా ఈ రైలు ప్రమాదంలో 8 మంది చనిపోవడం శోచనీయం. చనిపోయిన కుటుంబాలకు అన్ని విధాల ఆదుకుంటామని ప్రభుత్వం తెలిపింది. అంతేకాద క్షతగాత్రులకు మెరుగైన సహాయం అందిస్తామని చెప్పారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook