)
Rules Change In General Ticket Booking: ఇకపై మీరు రైల్వే టికెట్స్ బుక్ చేసుకోవాలంటే ఆధార్ ప్రామాణీకరణ తీసుకోబడుతుంది. ఈ నేపథ్యంలో ముందుగానే ఆధార్ ప్రామాణికరించబడిన వినియోగదారులు మాత్రమే రిజర్వ్ చేసుకోవాలి. ఇది సాధారణ జనరల్ టికెట్ బుకింగ్ చేస్తున్న వినియోగదారుల కూడా వర్తిస్తుంది. రైల్వే ఈ విధానాన్ని అక్టోబర్ 1 నుంచి జనరల్ రిజర్వేషన్ వారికి కూడా తప్పనిసరి చేసింది. జనరల్ టికెట్ బుకింగ్ సమయంలో అక్టోబర్ 1 నుంచి ఆధార్ ప్రామాణికరణ తప్పనిసరి. ఇది తప్పనిసరి అని రైల్వే మంత్రిత్వ శాఖ సోమవారం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఇలా ఉండగా జూలై 1వ తేదీ నుంచి తత్కాల్ టికెట్ ఆన్లైన్ బుకింగ్ లో కూడా భారీ మార్పు చేసిన సంగతి తెలిసిందే. ఆన్లైన్లో బుక్ చేసుకునే వారికి ఆధార్ ధ్రువీకరణ తప్పని సరి చేసింది. ఇప్పుడు జనరల్ టికెట్లు బుక్ చేసుకునే వారికి అక్టోబర్ 1 నుంచి వర్తించనుంది. ప్రధానంగా ఈ ఆధార్ ప్రామాణికరణ అనేది టికెట్ బుకింగ్ బ్రోకర్ల నివారించడానికి ఈ భారీ మార్పు చేసింది రైల్వే. రిజర్వేషన్ టికెట్ల విషయంలో ఎలాంటి మార్పు లేదని తెలిపింది. జనరల్ రిజర్వేషన్ ప్రారంభమైన పది నిమిషాల పరిమితి సమయంలో ఎలాంటి మార్పు ఉండదు . అదే సమయంలో ఏజెంట్ల ద్వారా రైల్వే టికెట్ బుకింగ్ చేసుకునే వారికి మొదటి రోజున రిజర్వ్ చేసిన టికెట్ల కు అనుమతి లేదు.
రైల్వే జనరల్ టికెట్ బుకింగ్ చేసుకున్నప్పుడల్లా ఆధార్ ప్రామాణికరించబడిన వినియోగదారులు మాత్రమే మొదటి 15 నిమిషాలు ఐఆర్సీటీసీ యాప్ లేదా వెబ్సైట్ ద్వారా టికెట్లను బుక్ చేసుకోగలరు. ఇప్పటినుంచి తాత్కాల్ టికెట్ బుకింగ్ జనరల్ రిజర్వేషన్ పైన కూడా ప్రభావం పడనుంది. అంటే మీరు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి రైల్వే ప్రయాణం చేయాలనుకుంటే కచ్చితంగా ఆ తేదీ నుంచి రెండు నెలల ముందుగానే బుక్ చేసుకోవాలి. ఇప్పుడు 2025 జనవరిలో రైల్వే ప్రయాణం చేయాలనుకుంటే మీరు నంబర్ లోనే రైల్వే టికెట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. రాత్రి 12:20 గంటలకు ఈ టికెట్ బుకింగ్ ప్రారంభమవుతుంది. అయితే 12: 20 నుంచి 12 :35 మధ్యల టికెట్ బుక్ చేసుకునే వారికి ఆధార్ ధ్రువీకరణ తప్పనిసరి చేసింది. ఆ సమయంలో చాలా ఎక్కువ డిమాండ్ కూడా ఉంటుంది ఆ 15 నిమిషాలు కీలకం.
రానున్నది దసరా దీపావళి పండుగలు సందర్భంలో ఎక్కువ శాతం మంది సొంతూళ్లకు రైల్వే ప్రయాణం చేస్తారు. రైల్వే ప్రయాణం అతి సులువు. అంతే కాదు తక్కువ సమయంలోనే డెస్టినేషన్ కి చేరుస్తుంది. వీటి టికెట్ ధరలు కూడా తక్కువగా ఉంటాయి. ఈ నేపథ్యంలో రైల్వే టికెట్ల బుకింగ్ డిమాండ్ భారీగా ఉంటుంది. ముఖ్యంగా 60 రోజుల ముందు రైల్వే టికెట్ బుకింగ్ విండో తెరిచినప్పుడు తత్కాల్ బుకింగ్ సమయంలో కనిపించే రద్దీ మాదిరిగానే సాధారణ బుకింగ్ లో కూడా కనిపించనుంది. ఈ సమయంలో మోసపూరితనమైన థర్డ్ పార్టీ బ్రోకర్ను నివారించడానికి బుకింగ్ ప్రక్రియను పారదర్శకంగా రైల్వే చేస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.