Union minister daughter harassed case: కేంద్ర మంత్రి రక్షా ఖడ్సే తన కూతురుని ఇటీవల కొందరు వేధింపులకు పాల్పడ్డారని చెప్పడం ప్రస్తుతం దేశంలో చర్చనీయాంశంగా మారింది. ఒక కేంద్ర మంత్రి, మరోవైపు సొంత పార్టీ అధికారంలో ఉన్న వాళ్లకే ఈ పరిస్థితి ఉంటే.. మిగత సాధారణ ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో అని ఈ ఘటనపై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు.
కేంద్ర మంత్రి రక్షా ఖడ్సే.. మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో శుక్రవారం రాత్రి జరిగిన ఓ కార్యక్రమంలో తన కుమార్తెను, ఆమె స్నేహితులను కొందరు వ్యక్తులు వేధించారంటూ కేంద్ర మంత్రి, బీజేపీ నేత రక్షా ఖడ్సే ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు ఏడుగురిని అరెస్ట్ చేశారు. దీనిపై పెద్ద రాజకీయ దుమారం చెలరేగింది.
ఈ ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందిస్తూ నిందితులు ఓ రాజకీయ పార్టీకి సంబంధించిన వారని మండిపడ్డారు. కావాలనే కేంద్ర మంత్రి కూతుర్ని టార్గెట్ గా చేసుకుని వేధింపులకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. నిందితుల్లో ఒకడైన పీయూష్ మోరే.. శివసేన షిండే వర్గానికి చెందినవాడుగా సమాచారం. అయితే.. ఈ విధంగా వేధింపులు చేయడం ద్వారా.. పార్టీని ప్రజల్లో నెగెటివ్ అభిప్రాయం వచ్చేందుకు ఈ విధంగా చేసినట్లు తెలుస్తొంది.
Read more: Himani Narwal Murder: హిమానీ నర్వాల్ హత్య కేసులో కీలక పరిణామం.. నిందితుడు అరెస్ట్.. ఎవరంటే..?
ఈ క్రమంలో నిందితుల్లో ఏడుగురిని అరెస్ట్ చేసి తమదైన స్టైల్ లో విచారిస్తున్నారు. వీరంతా వేధింపులకు పాల్పడటానికి వెనుక ఎవరైన ఉన్నారా.. అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ కారణంగా కేంద్ర మంత్రి ఏకంగా పోలీస్ స్టేషన్ మెట్లేక్కడం కూడా ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









