DA Hike 2025: ఈ రాష్ట్రాల ప్రభుత్వ ఉద్యోగులకు సూపర్ గిఫ్ట్.. ఒకేసారి భారీగా జీతాలు పెంపు..!

UP Govt DA Hike News: ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు యోగి సర్కార్ అదిరిపోయే ప్రకటన చేసింది. ఉద్యోగులకు 2 శాతం డీఏ పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో డీఏ 53 శాతం నుంచి 55 శాతానికి చేరింది. పెంచిన డీఏ జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది.  

Written by - Ashok Krindinti | Last Updated : Apr 10, 2025, 01:52 PM IST
DA Hike 2025: ఈ రాష్ట్రాల ప్రభుత్వ ఉద్యోగులకు సూపర్ గిఫ్ట్.. ఒకేసారి భారీగా జీతాలు పెంపు..!

UP Govt DA Hike News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇటీవల మోదీ సర్కార్ 2 శాతం డీఏ పెంపును ప్రకటించింది. గత ఏడేళ్లలో ఎన్నడూ లేనివిధంగా కేవలం 2 శాతం మాత్రమే డీను పెంచడం ఉద్యోగులకు నిరాశకు గురి చేసింది. 2 శాతం డీఏ పెంపుదలతో మొత్తం డీఏ 55 శాతానికి చేరింది. పెంచిన జీతాలను జనవరి 1వ తేదీ నుంచి అమలు చేసింది. కేంద్ర ప్రభుత్వం తరువాత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉద్యోగులకు జీతాలు పెంచుతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా 2 శాతం డీఏను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధ్యక్షతన భేటీ అయిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. జీతాల పెంపు జనవరి 1, 2025 నుంచి అమల్లోకి వస్తుంది. ఈ పెంపుతో యూపీ రాష్ట్ర ఉద్యోగుల డీఏ 53 నుంచి 55 శాతానికి పెరిగింది.

Add Zee News as a Preferred Source

రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో దాదాపు 16 లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. అదేవిధంగా దాదాపు 12 లక్షల మంది పెన్షనర్లకు డియర్‌నెస్ రిలీఫ్ (DR)లో 2 శాతం ఉంటుంది. "ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం జనవరి 1, 2025 నుంచి రాష్ట్ర ఉద్యోగులకు ఇస్తున్న 53 శాతం నుంచి 55 శాతాని డియర్‌నెస్ అలవెన్స్‌ను పెంచాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం వల్ల దాదాపు 16 లక్షల మంది ఉద్యోగులు ప్రయోజనం పొందుతారు. మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు" అని ముఖ్యమంత్రి యోగి తెలిపారు. రాష్ట్ర ఉద్యోగుల ప్రయోజనాలను పరిరక్షించడం ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యత అని ఆయన అన్నారు.

గత నెలలో మహారాష్ట్ర సర్కార్ కూడా ఉద్యోగులకు డీఏను పెంచింది. 5వ వేతన సంఘం వేతన స్కేల్ కింద ఉద్యోగులకు కరవు భత్యంలో 12 శాతం పెంపును ప్రకటించింది. దీంతో 443 శాతం నుంచి 455 శాతానికి డీఏ పెరిగింది. సవరించిన జనవరి 31, 2025 నుంచి అమలు చేయనున్నారు. ఈ నెల 4వ తేదీన అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు అదనంగా 2 శాతం డీఏ పెంచుతున్నట్లు ప్రకటించారు. జనవరి 1, 2025 నుంచి అమలులోకి వస్తుందని వెల్లడించారు. డీఏ పెంపుదల వల్ల దాదాపు 17 లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది.  

READ ALSO: Viral Video: స్కూల్లో అమానవీయం.. పీరియడ్స్ వచ్చిందని బాలికను ఆరుబైట కూర్చొబెట్టి ఎగ్జామ్.. వీడియో వైరల్..

READ ALSO:  ఎండ వేడిమిలో డిహైడ్రేషన్‌కు గురికాకుండా నీళ్లలో ఇవి కలుపుకొని తాగండి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

About the Author

Ashok Krindinti

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News