
No Helmet No Petrol Rule: ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది ఇకనుంచి హెల్మెట్ ధరించకుండా పెట్రోల్ పంపు లకు వచ్చే వాహనదారులకు పెట్రోల్ అమ్మకూడదని తెలిపింది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే జారీ చేసింది. అయితే ఏప్రిల్ 26వ తేదీ నుంచి ఇది అమల్లోకి తీసుకురాబోతున్నట్లు యూపీ ప్రభుత్వం వెల్లడించింది. ఈ కీలక ప్రకటన జారీ చేయడానికి ప్రధాన కారణం రోడ్డు ప్రమాదాలను నివారించేందుకేనని అధికారులు తెలుపుతున్నారు. హెల్మెట్ ధరించని వారికి ఏప్రిల్ 26వ తేదీ నుంచి పెట్రోల్ విక్రయించకూడదని పెట్రోల్ బంక్ యజమానులను అధికారులు సూచించారు.
క్రమంగా భారతదేశంలో రోడ్డు ప్రమాదాల కారణంగా మరణించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూ వస్తోంది అయితే నిబంధనలను ఉల్లంఘించి వాహనదారులు హెల్మెట్ లేకుండా నిర్లక్ష్యంగా ప్రయాణం చేయడం వల్లే చాలామంది ప్రమాదాల బారిన పడుతున్నారు. కొంతమంది అయితే వాహనదారులు కారులో కూర్చొని సీట్ బెల్ట్ కూడా ధరించడం లేదు. వీటన్నిటిని నివారించేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం ప్రత్యేకమైన కఠిన ట్రాఫిక్ నిబంధనలను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం అందరికీ తెలిసిందే.
తమిళనాడులో బైక్ పై ప్రయాణం చేసే ప్రతి ఒక్కరు హెల్మెట్ తప్పకుండా ధరించాల్సి ఉంటుంది.. లేకపోతే భారీ జరిమానాలను అధికారులు విధిస్తారు. ఇలాంటి కఠిన నియమాన్ని ఇటీవలే పుదుచ్చేరి గవర్నమెంట్ కూడా అమల్లోకి తీసుకువచ్చింది. అయితే ఈ ప్రత్యేకమైన కఠిన నిబంధనల ద్వారా ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే ప్రమాదాల రేటు కూడా తగ్గుతూ వస్తోంది. దీనిని దృష్టిలో పెట్టుకొని ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కూడా హెల్మెట్ ధరించని వారికి పెట్రోల్ అమ్మబోమని ప్రకటించింది. ఇప్పటికే ఈ కఠిన నిబంధనకు సంబంధించిన అధికారిక లేఖను ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రవాణా కమిషనర్ బ్రజేష్ నరైన్ సింగ్ అధికారికంగా జారీ చేశారు. ద్విచక్ర వాహనదారులు ఎవరైనా హెల్మెట్ లేని వారికి ఇకనుంచి పెట్రోల్ అమ్మకాలు ఉండవని ఆయన ఆదేశించారు. అంతేకాకుండా హెల్మెట్లు లేకపోవడం వల్ల జరిగే మరణాలను నివారించేందుకు ఈ ముఖ్యమైన నిబంధనను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు.
అంతేకాకుండా ఈ జారీ చేసిన లేఖలు పెట్రోల్ పంపులు నిర్వాహకులకు కూడా కొన్ని ఉత్తర్వులను అందించారు. ముఖ్యంగా పెట్రోల్ పంపు ముందు తప్పకుండా హెల్మెట్ అవగాహనపై పెద్ద బోర్డులు ఏర్పాటు చేయాలని దీని కోసం ఏడు రోజుల గడువు ఇచ్చినట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా హెల్మెట్ ధరించని వారికి అస్సలు పెట్రోల్ అమ్మకూడదని సూచించారు. 2022 సంవత్సరంలో ఉత్తరప్రదేశ్లో అధికారికంగా 36వేల రోడ్డు ప్రమాదాలు నమోదయ్యాయి. అంతేకాకుండా ఈ ప్రమాదాల్లో 21,000 మంది తీవ్రంగా గాయపడ్డారు. ముఖ్యంగా లక్నోలోనే ఎక్కువగా ప్రమాదాలు సంభవించాయని కేంద్ర గణాంకాల్లో తేలింది. అయితే ఈ ప్రమాదాలను నివారించేందుకే కీలక నిర్ణయం తీసుకున్నట్లు యోగి సర్కార్ తెలిపింది..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook