)
Vijay thalapathy announces 20 lakh for ex gratia to karur victims: తమిళ సినీ నటుడు, తమిళ వెట్రి కళగం (టీవీకే) పార్టీ అధ్యక్షుడు విజయ్ నిన్న (శనివారం) కరూర్లో సభను నిర్వహించారు. విజయ్ ను చూసేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు. మరోవైపు.. ఈ కార్యక్రమంకు పదివేల మందికి పర్మిషన్ తీసుకున్నారు. కానీ అనూహ్యంగా 50 వేల మందికిపైగా అభిమానులు తరలివచ్చారు.
మరోవైపు మధ్యాహ్నం రావాల్సిన విజయ్ కాస్త.. రాత్రి 7 గంటల ప్రాంతంలో రావడంతో అప్పటి వరక వేచి ఉన్న కొంత మంది కుప్పకూలీపోయారు. మరోవైపు ఒక్కసారిగా అందరు ఒకర్ని మరోకరు తోపులాట చేసుకొవడంతో ఒకరి మీద మరోకరు పడిపోయి భారీగా తొక్కిసలాట సంభవించింది. దీనిలో కింద పడిపోయి ఊపిరాడక పోవడంవల్లనే చాలా మంది చనిపోయారు.
ఈ విషాద ఘటనలో ఇప్పటి వరకు 39 మంది దుర్మరణం చెందారు. మరో వంద మంది వరకు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే.. కరూర్ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ.. కేంద్ర మంత్రులు, సినిమా ప్రముఖులు తమ సంతాపం వ్యక్తం చేశారు. ఇప్పటికే సీఎం స్టాలీన్ చనిపోయిన వారికి 10 లక్షలు, చికిత్స పొందుతున్న వారికి 1 లక్ష చొప్పున సాయం ప్రకటించారు.
మరోవైపు ఈ ఘటనపై విజయ్ దళపతి కూడా రియాక్ట్ అయ్యారు. తన మనస్సు ముక్కలైపోయిందన్నారు. బాధితకుటుంబాలకు అండగా ఉంటామన్నారు. తొక్కిసలాట మృతుల కుటుంబాలకు టీవీకే అధినేత విజయ్ ఎక్స్గ్రేషియా ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.20లక్షల చొప్పున పరిహారం ప్రకటిస్తున్నట్లు తెలిపారు. క్షతగాత్రులకు రూ.2 లక్షల చొప్పున పరిహారం అంజేస్తున్నామని వివరించారు.
ఈ క్రమంలో ఈ తొక్కిసలాట ఘటన మాత్రం దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. మరోవైపు కరూర్ ప్రాంతంలో ఉన్న ఆస్పత్రులన్ని బాధితుల ఆర్తనాదాలతో మిన్నంటాయి. తమ వారి కోసం చాలా మంది బాధిత కుటుంబాలు ఆస్పత్రులు చుట్టు తిరుగుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి