)
Vijay thalapathy karur Rally Stampede several died: తమిళనాడులోని కరూర్ లో టీవీకే పార్టీ విజయ్ మీటింగ్ లో భారీ తొక్కిసలాట సంభవించింది. ఈ క్రమంలో ఇప్పటి వరకు 40 మందికి పైగా మృతి చెందారు. మృతుల్లో ఆరు మంది చిన్నారులున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఘటనపై సీఎం స్టాలీన్ సీరియస్ అయ్యారు. ఘటన ప్రదేశంలో యుద్ద ప్రాతిపాదికన సహయక చర్యల్ని చేపట్టాలని అధికారుల్ని ఆదేశించారు.
మరోవైపు పెద్ద ఎత్తున పోలీసులు, వైద్యుల సిబ్బంది ఘటన ప్రదేశంకు చేరుకుంటున్నారు. మొత్తంగా ఈ ఘటనకు కారణమైన టీవీకే పార్టీ అధినేత విజయ్ దళపతిని అరెస్ట్ చేయాలని కూడా తమిళ నాట వాదనలు విన్పిస్తున్నాయి.
గతంలో తెలంగాణలో పుష్ప2 ప్రీమియర్ షో నేపథ్యంలో చోటుచేసుకున్న తొక్కిసలాట నేపథ్యంలో రేవతి అనే మహిళ మరణించడంతో దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్గా రియాక్ట్ అయ్యింది.
పోలీసులు ముందస్తు అనుమతిలేకుండా వచ్చినందుకు అల్లు అర్జున్ ను అరెస్ట్ కూడా చేశారు . మరీ ఇప్పుడు ఏకంగా 40 మంది వరకు దుర్మరణంకు కారణమై, అదే విధంగా అనేక మంది ఇంకా ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ క్రమంలో విజయ్ దళపతిని అరెస్ట్ చేయాలని డిమాండ్ లు వస్తున్నాయి.
దీనిపై తమిళనాడు స్టాలీన్ ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తుందో వేచి చూడాలి. ఇప్పటికైతే బాధితుల ఆర్తనాదాలతో ఆ ప్రదేశం పూర్తిగా విషాదకరంగా మారింది. తమ వారి కోసం బాధిత బంధువులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. వైద్యులు గాయపడ్డవారికి చికిత్సను అందిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి