నేటి ఆర్థరాత్రి వరకు టికెట్ల ఛార్జీపై 75% తగ్గింపు ఆఫర్: విస్తారా

మాన్‌సూన్ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని సాధారణంగా విమానయాన సంస్థలు డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటిస్తుంటాయి.

Last Updated : Jun 6, 2018, 12:43 PM IST
నేటి ఆర్థరాత్రి వరకు టికెట్ల ఛార్జీపై 75% తగ్గింపు ఆఫర్: విస్తారా

నేటి ఆర్థరాత్రి వరకు టికెట్ల ఛార్జీపై 75% తగ్గింపు ఆఫర్‌ను ప్రకటించింది విస్తారా ఎయిర్‌లైన్స్.  ఈ ఒక్క రోజు మాత్రమే తగ్గింపు ధరలకు టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఈ ఏడాది జూన్ 21 నుంచి సెప్టెంబర్ 27 వరకు ప్రయాణించాలనుకునే వారికి ఈ అవకాశం కల్పించింది. సాధారణ చార్జీలపై మార్గాన్ని బట్టి 75 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తోంది.

రూ.1,299 నుంచి ప్రయాణ ఛార్జీలు ప్రారంభమవుతాయి. హైదరాబాద్-ఢిల్లీ మార్గంలో అయితే టికెట్ ధర రూ.2,199. టికెట్ ఛార్జీకి అదనంగా సర్ ఛార్జీ, పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. మాన్‌సూన్ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని సాధారణంగా విమానయాన సంస్థలు డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. ఎయిర్ ఏషియా రూ.1,399 నుంచి టికెట్లను ఆఫర్ చేస్తోంది. ఈ నెల 10 వరకు టికెట్లను బుక్ చేసుకొనే అవకాశం కల్పించింది.

Trending News