)
Woman lawyer molested after late night party in pune: ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చిన కామాంధులు మాత్రం మారడటం లేదు. ప్రతి రోజు మహిళలపై వేధింపులు వార్తలలో ఉంటున్నాయి. పసి పాప నుంచి పండు ముసలి వారి వరకు కామాంధులు ఎవర్ని వదలడంలేదు. ఈ క్రమంలో పబ్లిక్ ప్రదేశాలు, ప్రైవేటు ప్రదేశాలు చివరకు ఇటీవల కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నవారు, తోడబుట్టిన వారు సైతం దారుణాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో మహా రాష్ట్రలోని పూణేలో దారుణం వెలుగులోకి వచ్చింది.
ఒక లేడీ లాయర్ తన వ్యక్తిగత పనిమీద పూణెకు వచ్చింది. అక్కడ ఆమె కోరేగావ్ పార్క్ లో ఉన్న ఫైవ్ స్టార్ హోటల్ లో బస చేసింది. అక్కడ మద్యం తాగుతుండగా పక్కన వారితో పరిచయం ఏర్పడింది.
రాత్రి పూట మరో బార్ కు వెళ్లేందుకు కారులో స్టార్ట్ అయ్యారు. ఇంతలో సదరు వ్యక్తి ఆమెను ముంధ్వా–కోరేగావ్ పార్క్ మార్గంలో రాగానే కారులో అత్యాచారం చేశాడు. ఆ తర్వాత కారు కొంచెం దూరం వెళ్లాక మరో ఇద్దరు కూడా ఎక్కారు . వారు కూడా ఆమెపై అత్యాచారం చేశారు.
ఆ తర్వాత నిర్జల ప్రదేశంలో మహిళ లాయర్ ను వదిలేసి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ క్రమంలో బాధితురాలు తెరుకుని దగ్గరలోని పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి ముగ్గురు వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. అత్యాచారంకు పాల్పడింది.. అభిషేక్ నవనాథ్ ముక్తే, ధనుంజయ్ సోర్టే, ఆదేశ్ శిందేలుగా గుర్తించారు. నాలుగో వ్యక్తి కోసం గాలింపు చేపట్టారు. ఈ ఘటన ప్రస్తుతం పూణెలో సంచలనంగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి