)
woman tears a part of her saree to uttarakhand cm dhamis wrist: ఇటీవల ఉత్తరాఖండ్ లో భారీగా వరదలు సంభవించాయి. రెప్పపాటులో భారీగా కుండపోతగా కురిసిన వర్షాలతో కొండ చరియలు విరిగిపడ్డాయి. అంతేకాకుండా..ముఖ్యంగా ధారాళి ప్రాంతం కళ్ల ముందే మరు భూమిగా మారిపోయింది. దాదాపు 20 మంది వరకు కళ్ల ముందే జలప్రవాహాంలో కొట్టుకుని పోయారు. అంతే కాకుండా.. మరోవైపు అక్కడున్న ఆర్మీ క్యాంప్ సైతం వరదల్లో కొట్టుకుని పోయింది. అనేక మంది జల ప్రళయంలో జలసమాధి అయ్యారు.
ఇప్పటికి అనేక మంది ఆచూకి ఇంకా లభ్యం కాలేదు. ఈ క్రమంలో సీఎం పుష్కర్ సింధ్ ధామి వర్షాలపై కేంద్రబలగాలు, ఎన్డీఆర్ఎఫ్,ఎస్డీఆర్ఎఫ్, ఐటీబీపీలను రంగంలోకి దింపాయి. ఈ క్రమంలో సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు. అయితే.. తాజాగా.. సీఎం పుష్కర్ సింగ్ ధామి ఉత్తరాఖండ్ లో వరదలు సంభవించిన ప్రదేశంలోకి వెళ్లారు.
అక్కడ ప్రజలతో మమేకం అయ్యారు. వారికి తమ ప్రభుత్వం అన్నిరకాలుగ ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు.ఈ క్రమంలో.. గుజరాత్ లోని అహ్మదాబాద్ యాత్రికురాలు ధన్ గౌరీ బరోలియా సీఎంను దగ్గర నుంచి చూడగానే భావోద్వేగానికి గురైంది. వెంటనే రాఖీ పండగ గుర్తొచ్చి..తన చీరకొంగు చించిమరీ సీఎం పుష్కర్ సింగ్ ధామికి రాఖీని కట్టింది.
ఈ ఘటనతో ఆయన కూడా ఎమోషనల్ అయ్యారు. అక్కడి వారు... మహిళ సీఎం చేతికి రాఖీ కట్టడాన్ని ఫోన్ లలో రికార్డు చేశారు. ద్వాపర యుగంలో ద్రౌపది తన కొంగుతో గాయమైన కృష్ణుడి వేలికి కడుతుంది. అప్పటి నుంచి కృష్ణుడు తన సోదరిలా.. ద్రౌపదిని ఎల్లప్పుడు కాపాడుతుంటారు.
ఇక్కడ కూడా సదరు మహిళ తమను వరదల్లో నుంచి అచ్చం.. కృష్ణుడిలా వచ్చి అధికారుల సాయంలో తాము ప్రాణాలతో బైటకు వచ్చేలా సీఎం చేశారని చెబూతూ భావోద్వేగానికి గురైంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు కూడా మహిళ చేసిన పనికి ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇది కదా అసలైన ప్రేమ... అంటూ ఎమోషనల్ అవుతున్నారు.